విషాద యోగము
భగవద్గీత
వద్దంటారు భగవత్పాదులు. గీతా శాస్త్రం గీతా శాస్త్రమని మాటిమాటికీ హెచ్చరిస్తుంటా రాయన. అసలు గీతలోనే ఉందామాట. ఇతి గుహ్యతమం శాస్త్రమంటాడు మహర్షి. తస్మా చ్ఛాస్త్రం ప్రమాణంతే - యశ్శాస్త్ర విధి ముత్సృజ్య అని ఇటూ అటూ కూడా తిప్పి తిప్పి మాటాడుతాడు. కాకపోయినా ఉపనిషత్తు శాస్త్రమయి - ఉత్తర మీమాంస శాస్త్రమయి గీత శాస్త్రం కాకపోవట మేమిటి ప్రస్థాన త్రయమంతా కలిసి ఒకే ఒక శాస్త్రమని గదా పేర్కొన్నాము. శాస్త్రమనే అభిప్రాయంతోనే శాస్త్రాని కవశ్యంగా ఉండవలసిన అధికారి విషయ సంబంధ ప్రయోజనాలనే అనుబంధ చతుష్టయాన్ని కూడా భగవద్గీత కన్వయించి చూపారు శంకరులు. ఇమం ద్వి ప్రకారమ్ ధర్మమ్ నిశ్రేయస ప్రయోజనం పరమార్ధ తత్త్వంచ వాసు దేవాఖ్యం పరం బ్రహ్మ అభిధేయ భూతం విశేషతః అభివ్యం జయత్ విశిష్ట ప్రయోజన సంబంధా భిధేయ వత్ గీతాశాస్త్రమ్.
అంచేత శాస్త్రీయమైన మార్గంలోనే బోధ చేయాలి గీత. చేస్తున్నది కూడా. శాస్త్రమెప్పుడూ అనువాద విధాన రూపంగా నడుస్తుంది. మనకిప్పుడున్న అనుభవాన్ని పేర్కొనట మను వాదం. పోతే దానికిది పరిహారమని సూచించటం విధానం. అలాగే చేస్తున్న దిప్పుడు గీత. మరణమే ప్రాణు లందరికీ ఉన్న సమస్య అని మన సమస్యను వర్ణించింది. అదే మొట్టమొదటి అధ్యాయం విషాదయోగం. కాగా దీనికి పరిహార
Page 36