విషాద యోగము
భగవద్గీత
అందుకేనేమో భగవత్పాదులు కూడా సమస్యనేమిటి చెప్పేదని విషాదయోగానికి ఎక్కువగా భాష్యం వ్రాయకుండా మూడు నాలుగు మాటలలో క్లుప్తంగా చెప్పి ముగించారు. అత్ర దృష్ట్వాతు పాండ వానీక మిత్యారభ్య యావ న్నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూస్జీం బభూ వహ ఇత్యేత దంతః ప్రాణినాం శోకమోహాది సంసార బీజభూత దోషోద్భవ కారణ ప్రదర్శనార్ధత్వేన వ్యాఖ్యేయో గ్రంధః - తధాహి అర్జునేన రాజ్య గురుపుత్ర మిత్ర సుహృత్స్వజన సంబంధి బాంధవేషు అహమేతేషాం మమైతే ఇత్యేవం ప్రత్యయ నిమిత్త స్నేహ విచ్ఛేదాది నిమిత్తా ఆత్మనః శోకమోహౌ ప్రదర్శితౌ కధం భీష్మమహం సంఖ్యే ఇత్యాదినా - ఇక్కడ పాండవ కౌరవ సైన్యాన్ని చూచి అనే శ్లోకం మొదలు ఇక నేను యుద్ధం చేయనని రథంలో కూలబడి పోయాడనే శ్లోకం వరకూ మహర్షి చెప్పదలచిన విషయ మొక్కటే. లోకంలో ప్రాణులందరికీ సంసార బంధమనేది ఏర్పడిందంటే దానికి కారణం మోహ శోకాలే. దానికి నిదర్శన మర్జునుడు తన వాళ్ల నందరినీ చూచి వీరందరూ నావారు వీరందరి వాడనూ నేను గదా అలాంటప్పుడు భీష్మ ద్రోణాదులతో నేనెలా పోరాడగలనని వాపోవటమే. ఇలా వ్యాఖ్యానిస్తే సరిపోతుందీ విషాదయోగ మంతా నంటారు ఆచార్యులవారు.
భగవద్గీత అనేది ఇతిహాసం కాదు. పురాణం కాదు. అది ఒక గొప్ప శాస్త్రం. శాస్త్రంగానే చూడాలి దాన్ని. ఏదో కధా కార్కాణమని చూడ
Page 35