జ్ఞాన యోగము
భగవద్గీత
ఫల మేమిటో తెలుసా. సమస్త భూతాలనూ అవి ప్రాణులే కాదు. జడ పదార్థాలే కాదు మొత్తం చేతనాచేతన ప్రపంచాన్నే బాహ్యంగా కాక నీ స్వరూపంలోనే చేరి పోయినట్టు నీవు చూడగలవు. నీతో ఏకమై పోయినట్టు భావించగలవు నీలోనా గాదు. ఆ మాటకు వస్తే నాలో కూడా అలాగే చూడగలవంటాడు పరమాత్మ. నీలోనా నాలోనా అని ప్రశ్న వస్తే నీవేమిటి నేనేమిటి అంతా కలిసి ఉన్న దొకే నేను గదా అలా భావించమని సలహా అథోమయి అంటే అర్థమిది. దీన్ని బట్టే తార్కాణ మవుతున్నది మనకు జీవేశ్వరు లిద్దరూ ఒక్కటేనని. క్షేత్ర జ్ఞేశ్వరైకత్వం సర్వోపనిషత్ప్రసిద్ధం ద్రక్ష్యసి అని వివరించారు భాష్యకారులు.
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి || 36 ||
కాగా ఇలాంటి ఆత్మ జ్ఞానం సద్గురూపదేశం వల్ల ఏమానవుడు శ్రవణం చేసి మననం చేసి తరువాత స్వయంగా తాను తన పాటికి నిది ధ్యాస సాగించి ఆత్మసాక్షాత్కారం పొందగలడో వాడి జన్మ సఫలం. వాడు కృతార్థుడు ఇక వాడంతకు ముందు జన్మలలో ఎన్ని పాపాలైనా చేసి ఉండవచ్చు అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ఎన్నెన్నో పాపకార్యాలు చేసి పాపాత్ములలో అతి పాపాత్ముడని పించుకొని ఉండవచ్చు నీవు. సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఆ పాపాలనే మహా సాగరాన్ని
Page 356