#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

పొందుతా రంటున్నదే గీత దానికేమి చెబుతారు సమాధానం. ఏమన్నదీ గీత. యజ్ఞం వల్ల ఏర్పడ్డ ఫలం మరణించదు. అది అమృతం. దాన్ని అనుభవించే సోమయాజులు కూడా సనాతనమైన బ్రహ్మతత్త్వాన్నే అందుకొంటాడన్నది - అప్పటికి వారికి కూడా అమృతత్వం మోక్షమనేది వచ్చినట్టే గదా. దానికి మా గురువుగారి మాటల్లో వినండి సమాధానం. సనాతనం బ్రహ్మ అంటే నిత్యసిద్ధమైన Eternal ఆ పరమాత్మ తత్త్వమే మేము కాదనలేదు. యాంతి గచ్చంతి. వీరు గూడా దాన్ని పొందుతారు. అదీ కాదనటం లేదు. అయితే ఒక తిరకాసుం దిక్కడ. ఆ పొందటానికి వీరికుండ వలసిన యోగ్యత ఏమిటి. వీరాబ్రహ్మాన్ని పొందటాని కెంత కాలం పడుతుం దనేది మన మాలోచించాలి. ముముక్ష వశ్చే త్కాలాతిక్రమాపేక్షయా అని రెండు మాటలు విసిరారక్కడ స్వామివారు. వెంటనే రాదా అమృతత్త్వమీ యజ్ఞానుష్ఠాతలకు. చాలాదీర్ఘకాలం పడుతుంది. అది కూడా అసలైన అమృతత్వం మీద వీరికపేక్ష ఉంటే. దీర్ఘ కాలమేమిటి. కొన్ని జన్మలు కర్మానుష్ఠానంలో మరికొంత కాలము పాసనలతో గడచి ఆ తరువాత కర్మయోగులయి సత్త్వశుద్ధీ ఏకాగ్రతా ఏర్పడితే ఆ బలంతో శ్రవణ మననాదులు చేసి గాని ఆత్మజ్ఞానం సంపాదించలేరు. అందుకే బహూనాం జన్మనా మంతే అన్నది గీత. అంతేగాని జ్ఞానులలాగా వీరికి వెంటనే రాదు మోక్షం. అది కూడా ముముక్ష ఉంటేనే కర్మఫల బుభుక్ష ఉన్నంత వరకూ ముముక్షకు నోచుకోలేరు.

Page 344

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు