#


Index

విషాద యోగము భగవద్గీత

కర్మణి. అర్జునా నేను ఆత్మ జ్ఞానం బోధించినా దానినందుకొనే అర్హత నీకు లేదు. నీకు అధికారం నేను బోధించిన కర్మయోగమే - అది నీకు తీవ్రమైన శ్రద్ధాసక్తులూ జిజ్ఞాసా అబ్బిన కొద్దీ సత్త్వశుద్ధి ఏర్పడి అదీ క్రమంగా ఎప్పటికో ఒకప్పటికి జ్ఞానానికి దారి తీస్తుందని సూచిస్తాడు. ఇంతకూ నచికేతుడొకడూ అర్జునుడొకడూ ఉన్నారని కాదు మనం భావించ వలసింది. ఆ రెండు పాత్రలూ మనకోసం సృష్టి అయినవే. నీకు తీవ్రమైన జిజ్ఞాసా ముముక్షా ఉంటే చెప్పు. మృత్యు రహస్యం బోధపడుతుంది. దానికి పరిష్కారమేదో అదీ తేటపడుతుంది. అలాటి సామర్ధ్యానికి నోచుకోకపోతే అడుగుతావు వింటావేగాని కంటావని మాత్రం మేము గారంటీ ఇవ్వలే మంటారు అటు శాస్త్రమూ ఇటు సద్గురువులూ. ఇదీ అసలు అంతరార్ధం.

  ఏతావతా తేలిన సారాంశ మేమిటి. విషాదమే జీవిత సమస్య. కఠోపనిషత్తు చెప్పినా అదే. భగవద్గీత చెప్పినా అదే. అర్జునుణ్ణి మరచిపోయి మనం భావిస్తే చస్తామనే భయం పుట్టి పెరుగుతున్న మనకందరికీ ఉంది. ప్రతిక్షణమూ మనలను వెంటాడుతూనే ఉంది. మనమూ మన చుట్టూ ఉన్న బంధువర్గమూ అందరమూ పోతామే అని. ఇందులో ఒకటి మిధ్యాత్మ అయితే ఇంకొకటి గౌణాత్మ. మిధ్యాత్మ నేను - గౌణాత్మ నన్నంటి పట్టుకొన్న బంధుమిత్రాదులు. ఇంకా దేవుడు మేలు చేస్తే వస్తువాహనాది జడపదార్ధాలు కూడా. నేను పోయినా కష్టమే. నాది పోయినా కష్టమే. ఒకటి అహం

Page 32

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు