విషాద యోగము
భగవద్గీత
గాదు - ఈ మృత్యుజాలంలో నుంచి బయటపడే మార్గమేదైనా ఉందా లేదా అని కచ్చితంగా తెలుసుకోవాలనే పట్టుదల కూడా ఉన్నవాడు.
ఇలాటి పట్టుదలా ధైర్యమూ అంతగా ఉన్నవాడు కాదు అర్జునుడు. దానికి నిదర్శన మసలు యుద్ధం చేసి శత్రుసైన్యాన్ని విధ్వంసం చేసి విజయం సంపాదించాలనే ఇచ్చతోనే వచ్చాడు కురుక్షేత్రానికి. వచ్చిన తరువాత తన వాళ్ళనూ ఎదుటివాళ్ళనూ చూచేసరి కందరూ యుద్ధభూమికి బలి అవుతారేమో - ఒకవేళ ఎంత బలవంతుడైనా తనకూ ఆ గతి పడితే పట్టవచ్చునని భయపడ్డాడు. తప్పించుకొని వెళ్లిపోదామని చూచాడు. అంటే సమస్య నుంచి తప్పించుకొందామని చూచాడేగాని అసలీ సమస్య ఏమిటి ఎందుకేర్పడింది దీనికి శాశ్వతమైన పరిష్కారమేమిటా అని ఆలోచించినవాడు కాడు. అది తెలిస్తే ఆ మార్గంలో కృషి చేసి తరించే పట్టుదలా లేదతనికి. తాత్కాలికమే అతని ఉత్సాహం. యుద్ధం చేసి గెలవాలని ఎంత ఉబలాటమో నలుగురూ చస్తారని భయపడి పరుగెత్తా లనుకోటమూ అలాటి ఉబలాటమే.
అందుకే నచికేతుడిలాగా దీక్షగా శ్రవణం చేసి గురూపదేశాన్ని ఒంట బట్టించుకొని ఆ మార్గంలో కృషి చేసి కృతార్ధత పొందలేదు. ఏదో అప్పటికప్పుడు పబ్బం గడుపుకొని బయట పడదామని అడిగాడు పరమాత్మను. ఆయన కూడా దానికి తగినట్టే బోధిస్తాడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు ర్భూః - మాతే సంగో స్వ
Page 31