#


Index

విషాద యోగము భగవద్గీత

ఇద్దరికీ పట్టుకొన్న దొకే ఒక సమస్య. వారిద్దరికే గాదు. ఆ ఇద్దరి బురఖాలో దాగి ఉన్న మనబోటి మానవు లందరికీ. మరణమే మనకున్న ఏకైక సమస్య. పామరంగా బ్రతికే సామాన్య మానవుడికే గాదు. పండితుడనని విర్రవీగే శాస్త్రజ్ఞుడికీ చివరకు ధర్మకార్యాలు చేసి తరువాత స్వర్గసుఖాల ననుభవిస్తానని గొంతెమ్మ కోరికలు కోరే ధార్మికుడికీ అందరికీ సమస్యే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అలాంటి వాడికి కూడా తప్పదని శాపనార్థం పెడుతున్నది గీత. యధాచ మరణం ప్రాప్య ఆత్మాభవతి అని కఠోపనిషత్తు పెట్టిన శాపమే ఇది.

  ఇదే విషాద యోగం మానవుడికి. విషాదమంటే దిగులు పడటం. దిగజారి పోవటం Dipression తాననుకొన్న దంతా తారుమారయితే భరించలేడు మానవుడు. దిగజారిపోతాడు. కుంగిపోతాడు. కాలూ చేయీ ఆడదు. మాటా పలుకూ లేక అసలు మనసు కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా అదే దైన్య స్థితి ఏర్పడింది అర్జునుడికి. కఠోపనిషత్తులో నచికేతుడిలా డీలాపడి పోలేదు. చివరిదాకా ధైర్యంగా మాటాడుతుంటాడు యముడితో. అర్జునుడి లాంటి వాడు కాడతడు. ఇతడిలాగా అతడెవరితో యుద్ధం చేయ నక్కరలేదు. తాను చస్తానని తన వారు చస్తారనే భయం వెంటనే కలగలే దతనికి. అసలు మృత్యువంటే ఏమిటో అది ఎందుకు ప్రాణులకు సంప్రాప్త మవుతున్నదో దాని విషయం పూర్తిగా తెలుసుకోవాలనే కార్యదీక్ష ఉన్నవాడు. ఊరక తెలుసుకోటమే

Page 30

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు