#


Index

విషాద యోగము భగవద్గీత

కఠోపనిషత్తంతా ఇదే. యమ నచికేత స్సంవాదమే. అందులో చర్చించిన విషయమంతా మరణమనే సమస్యే. అసలు మరణమనే దొక్కటే సమస్య మానవుడికి. ఎన్నో ఉన్నట్లు కనిపిస్తాయి కాని ఎన్ని ఉన్నా అందులోనే చేరిపోతాయి. ఎంచేత. వాస్తవానికి జననం లేదు. జీవితం లేదు. అంతా మరణమే. మార్పే గదా మరణమంటే. ఒకటి పోయి ఒకటి రావటమే మార్పు. బాల్యం పోయి యౌవనం యౌవనం పోయి వార్ధక్యం. అది పోయి అవసానం. మరణం కాక ఏమిటి - ఒక ఆలోచన పోయి ఒక ఆలోచన. ఒక మాట పోయి మరొక మాట - ఒక చేష్టపోయి మరొక చేష్ట మరణం కాక మరేమిటి. అలాగే ఒక జీవితమంతా గడచిపోయి మరొక జీవితం తయారవుతున్న దేమో. ఇలా జనన మరణాలు పరంపరగా ఏర్పడుతుంటే అంతా మరణమే జీవులకు. ఇలా ఆగకుండా సాగిపోవటమే మరణం.

  ఇది కఠోపనిషత్తు వర్ణించినట్టే వర్ణిస్తున్నది భగవద్గీత. దేహి నోస్మిన్ యధా దేహే - కౌమారం యౌవనం జరా తధా దేహాంతర ప్రాప్తిః జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ - దుఃఖాలయ మశాశ్వతమ్ - మృత్యు సంసార వర్త్మని ఇలా అంతా మృత్యుమయమే సంసారం. అందుకే దుఃఖాలయ మశాశ్వతం. అలాంటప్పుడిది గాక మరి సమస్య ఏముంటుంది మానవుడికి. కఠోపనిషత్తెక నెపం. భగవద్గీత అంత కన్నా పెద్ద నెపం. రెండింటిలోనూ అటు నచికేతుడికీ ఇటు అర్జునుడికీ

Page 29

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు