#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

గాని జ్ఞానం కాదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమని చెప్పబోతుంది గీత. జ్ఞానమొక్కటే పూతం పవిత్రం. అదే అన్ని మాలిన్యాలనూ కడిగివేస్తుంది. మిగతావన్నీ మాలిన్యాన్ని అంతకంతకు పోగు చేస్తాయి. అదే రజస్తమో గుణ ప్రభావం. ఆవరణ విక్షేపాలు వాటి వల్లనే. తన్మూలంగా మానవుడి జ్ఞాన మావృతమూ విక్షిప్తమూ Veiled and Distracted అవుతుందే తప్ప పరిశుద్ధ మవదు. పరిశుద్ధ మవక పోతే పరిపూర్ణమయి వ్యాపించలేదు. అలాంటప్పుడది సర్వవ్యాపకమైన పరమాత్మ జ్ఞానంగా ఎలా భాసించగలదు. జన్మ కర్మ బంధం నుంచి ఎలా విముక్తి నాసించ గలదు. కనుక జ్ఞానా దేవతు కైవల్యం. జ్ఞాన తపస్సే అసలైన తపస్సు. అదే మోక్షదాయకం.

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 11 ||

  అయితే ఇప్పుడొక అభియోగం Allegation వచ్చింది పరమాత్మ మీద. మన్మయా మాము పా శ్రితాః అన్నాడాయన. అంటే ఏమన్న మాట. తన్ను ఆశ్రయించిన వారికే మోక్షమనే ఫల మందిస్తున్నాడు. మిగతా వారు తన్నాశ్రయించటం లేదు కాబట్టి వాళ్ల నోట కరక్కాయే నంటున్నాడు. ఇది ఏమి న్యాయం. భగవానుడికి అందరూ సమానమే గదా. ఆయనకీ పక్షపాత బుద్ధి ఏమిటి. నిజమే అందరూ ఆయనకు కావలసినవారే. అదే అంటున్నాడు కూడా మమవర్త్మాను వర్తంతే మనుష్యాః - ప్రతి ఒక్క మానవుడూ నా

Page 300

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు