#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  అయితే మమవర్త్మాను వర్తంతే మనుష్యాః పార్ధసర్వశః మానవు లందరూ నా మార్గంలోనే ఉన్నారని భగవానుడే మనకు కితాబిచ్చాడు గదా. పైగా నత్వేవాహం జాతు నాసమ్. నాకే గాదు మీ బోటి మానవులకు కూడా జనన మరణాలు లేవని అంతకన్నా పెద్ద కితాబిచ్చాడు గదా. అలాంటప్పుడీ దుష్టులేమిటి. శిష్టులేమిటి. అధర్మం వల్ల ధర్మం దెబ్బ తినటమేమిటి. అది మరలా ఉద్దరించటానికి తానవతరించట మేమిటి. దీని కర్ధమేమిటి అని ఇప్పుడొక ఆక్షేపణ.

  ఆక్షేపణకు సమాధాన మిస్తున్న దిప్పుడీ శ్లోకం. మన ప్రశ్నకు తగినట్టే ఉన్నది పరమాత్మ సమాధానం. ఏమంటున్నాడో తెలుసా ఆయన. జన్మ కర్మచ మే దివ్యం. నేను జన్మించానని ఎవరన్నారు. నేనీ దుష్టశిక్షణా శిష్టరక్షణాది కర్మలన్నీ చేస్తూ వచ్చానని ఎవరన్నారు. అంతా వట్టిదే. అది మీ మానవుల భావనే. జన్మించినట్టు కనిపిస్తున్నదే గాని నీకు నేనసలు జన్మించలేదు. అలాగే ధర్మ సంస్థాపన చేస్తున్నట్టు నీకనిపిస్తున్నదే గాని నేనసలు ఏ స్థాపనా చేయటం లేదు. కారణం అది దివ్యం. మర్త్యం కాదు. దీవ్యతీతి దేవః - దేవస్య సంబంధి దివ్యం. ఏది వెలిగి పోతుంటుందో అది దివ్యం. ఎప్పుడూ అలా వెలిగిపోయేది జ్ఞానమే. అది ఇప్పుడు మన దగ్గరా ఉందా జ్ఞానం. కాని దివ్యం కాదు. ఎంచేత. మర్త్యమైన శరీరంతో ప్రాణంతో కలిసి వెలుగు తగ్గిపోయింది. మర్త్యం వెలగదు. అది జడమైన పదార్ధం. తనపాటికి తాను వెలిగే స్వభావం లేదు దానికి. మన జ్ఞానంలోనే అది మనకు స్ఫురిస్తున్నది. కాని శోచనీయమైన విషయమేమంటే అదే

Page 296

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు