#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  దీనితో పురాణ కధలన్నీ మనకర్ధమయి పోయాయి. పురాణాలన్నీ తరుచుగా దేవ దానవ జాతులూ వారు పరస్పరం చేసిన యుద్ధాలూ అందులో వారికి కలిగే జయాపజయాలూ ఇలాంటి కధలే గదా వర్ణిస్తాయి. అందులో కూడా దానవుల బలమే ఎక్కువయి దేవతలు బలహీనమయి పరుగెత్తి పోయి విష్ణుదేవుని శరణువేడటమూ ఆయన మత్స్యాది రూపాలలో ఏదో ఒక రూపంలో అవతరించి రాక్షసుల ఆగడా లరి కట్టి దేవతలనూ ఋషులనూ కాపాడటమూ. ఈ భావాలన్నీ వర్ణించాయంటే అందులో ఇదే అంతరార్థం. విష్ణువంటే స్థితి కర్త అయిన ఈశ్వరుడే. ఆయన చేసిన రాక్షస సంహార మధర్మ నిర్మూలనమే. దేవముని సంరక్షణ మాయన చేసిన ధర్మ ప్రతిష్ఠాపనమే.

  సంభవామి యుగే యుగే. ఇది ప్రతియుగంలోనూ జరుగుతూ ఉండే వ్యవహారమే. స్థాపించిన ధర్మమే మరలా కాలాంతరంలో అధర్మం వల్ల దెబ్బ తింటుంది. దెబ్బ తిన్న ధర్మాన్ని మళ్లీ మళ్లీ నిలబెడుతుండాలి. అందుకే యుగే యుగే అంటున్నాడు. ఇల్లు మరమ్మత్తుకు వస్తే ఎప్పటి కప్పుడెలా చేసుకోవాలో అలాగే ప్రపంచమనే మందిరం కూడా కూలిపో కుండా మరమ్మతు చేయవలసిన అవసరముంది. అది కూలదోసే వాళ్ల దుశ్చర్య లరికడితే గాని ప్రతిష్ఠ చేయలేడు. తన ఉద్యమానికి సహకరించే వాళ్లను కలుపుకొంటేగాని అది ఫలోన్ముఖం కాబోదు. దేవకార్య సముద్యతా అన్నట్టు దేవకార్యమేదో గాదు. శిష్టులైన మానవుల కార్యమే. అది ధర్మ

Page 294

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు