జ్ఞాన యోగము
భగవద్గీత
ద్యవతారాలు. నిర్గుణుడైతే అవతరించలేడు. సగుణుడైతే అవతరించగలడు. అదే ఇప్పుడీ కృష్ణావతారం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 8 ||
ఇంత ప్రయత్నం చేసి నిర్గుణమైన పరమాత్మ సగుణమైన రూపం ధరించి ఈ లోకంలో అవతరిస్తున్నాడంటే ఏమిటి ప్రయోజనమని అడిగావే. ఆ ప్రయోజనమేదో స్వయంగానే చెబుతున్నాడు. పరిత్రాణాయ సాధూనామ్. సత్పురుషులను రక్షించటానికీ. వినాశాయచ దుష్కృతామ్. అలాగే దుర్జనులైన వారిని శిక్షించాటానికే నట ఆయనజన్మ. దుష్టులను శిక్షిస్తేగాని శిష్టుల నాయన రక్షించలేడు. అలా జరిగితేగాని ధర్మసంస్థాపనార్దాయ ధర్మాన్ని ప్రతిష్ఠించలేడు లోకంలో.
ఇందులో దుష్టులెవరో గాదు. స్వార్ధబుద్ధితో అధర్మపరులై బ్రతికే మానవులు. వీరే రాక్షసులు. శిష్టులెవరో గారు. స్వార్ధ చింత లేకుండా నలుగురికీ మేలు చేసే ధర్మమార్గంలో జీవించే వారు. వీరే దేవతలూ ఋషులూ. భగవానుడు దుష్టశిక్షణ చేస్తున్నాడన్నా శిష్టరక్షణ చేస్తున్నాడన్నా అర్ధం మానవులలోని దుష్టబుద్ధిని పోగొట్టి శిష్టమైన బుద్ధిని ప్రసాదిస్తాడని. రాజస తామసాలేగదా అసుర సంపద. అది నిర్మూలిస్తే ఇక మిగిలిపోయింది సత్త్వగుణమే. అదే దైవ సంపద. శిష్టమంటే మిగిలి పోయిందనే అర్ధం.
Page 293