#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

జన్మించ లేదవి. అలాటి బుద్ధి బలం లేదు. అది ఉన్నవాడు మానవుడే. కాబట్టి వీడికే ఈ ధర్మా ధర్మ విచారం.

  ఇందులో తనకూ ఇతరులకూ హితమైన కర్మ ధర్మం. తనకు మాత్ర మనుకూలమయి ఇతరులకు హాని చేసేది అధర్మం. అధర్మమైనా సరే పాటించి తన స్వార్ధాన్ని పొందటమే ధ్యేయంగా పెట్టుకొని బ్రతికాడంటే మానవుడు కొంత కాలానికదే అందరూ పాటిస్తూ పోతే లోకంలో ధర్మం పూర్తిగా దెబ్బ తింటుంది. అధర్మం ప్రబలిపోతే ధర్మం బలహీనపడక ఏమవుతుంది. దీనికే ధర్మ విప్లవమని పేరు. దీనివల్ల మానవుడు పశు మృగప్రాయంగా బ్రతుకుతుంటాడు. అప్పుడు మానవ జన్మకు అర్ధం లేకుండా పోతుంది. ప్రపంచ సమస్యకు పరిష్కార మేమిటిక. ఎవడు చేయాలది. ఉన్న మానవు డొక్కడూ ఇలా పాడయిపోతే ఇక ఈ లోక వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ఎవరిది.

  మానవుణ్ణి ఎవడు సృష్టించాడో మొదట వాడిదే ఆ బాధ్యత. సృష్టించిన నేరానికి దాని స్థితిని కాపాడవలసిన వాడు కూడా వాడే. వాడంటే ఎవడో కాదు. పరమాత్మే. అంటే మానవుడి బుద్ధి కతీతమైన జ్ఞానైశ్వర్యాలు రెండూ పరిపూర్ణంగా ఉన్నవాడు. సంకుచిత బుద్ధితో మానవజాతి ధర్మాన్ని దెబ్బ తీస్తుంటే దాన్ని నిలబెట్టవలసింది పరిపూర్ణ జ్ఞానమున్న పరమాత్మే గదా. అది ఎలా ఉద్దరిస్తుంది ధర్మాన్ని. అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించాలంటే అది ఈ లోకానికి దూరంగా ఎక్కడో ఉండి పోతే అది సాధ్యమా. కనుకనే దిగిరావాలది. అదే

Page 291

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు