జ్ఞాన యోగము
భగవద్గీత
దీనికిస్తున్నది సమాధాన మీ శ్లోకం. యదాయదా హి ధర్మస్యగ్లా నిర్భవతి - అభ్యుత్థాన మధర్మస్య - లోకంలో ధర్మమనేది ఎప్పుడడు గంటి పోతుందో అప్పుడు. అధర్మం పైకి వచ్చి ధర్మాన్ని ఎప్పుడు దెబ్బ తీస్తుందో అప్పుడు - తదాత్మానం సృజామ్యహమ్. ఎప్పుడెప్పుడీ రెండు పద్రవాలూ లోకంలో సంప్రాప్తిస్తాయో అప్పుడప్పుడంతా నేను నన్ను సృష్టించు కొంటా నంటాడు పరమాత్మ. ఏమిటిది.
ఇందులో రెండున్నాయి మనం గ్రహించవలసిన సత్యాలు. అధర్మం పైకి వచ్చి ధర్మం దెబ్బ తినటం ఒకటి. భగవానుడు తన్ను తానే సృష్టించు కొని లోకంలోకి రావటమొకటి. ధర్మమూ అధర్మమనే భావాలు మానవ జాతికే మరి దేనికీ లేదీ సృష్టిలో. అచేతనాలైన పృధివ్యాదులకు గానీ వాటితో తయారైన భౌతిక పదార్ధాలకు గానీ లేదు. అలాగే చేతనాలైనా క్రిమి కీటకాలు మొదలుకొని పశుమృగ పక్ష్యాదులకు కూడా లేదీ చింత. పోతే మరెవరికి. ఒక్క మానవులకే. ఎందుకని. కర్మ కధికారి వీడొక్కడే. అవి చేయవా కర్మ. చేస్తాయి. కాని వాటికిది విధి ఇది నిషేధమనే తేడా లేదు. బ్రతుకు తెరువే వాటి లక్ష్యం. అందుకు కావలసిన కర్మ ఏదైనా చేస్తుంది. అక్కర లేదో మానేస్తుంది. స్వార్ధమే నడుపుతుంది వాటి జీవితాన్ని. శాస్త్రం కాదు. ఆచార్య పురుషులు కారు. వాసనా జ్ఞానమే తప్ప వాటి కిది మంచి ఇది చెడ్డ అనే వివేక జ్ఞానం లేదు. కర్మ జీవులవి - బుద్ధి జీవులు కావు. కర్మఫలమను భవించటానికే జన్మించాయి. మరలా పెద్దలు చేసే బోధ విని ఏది జీవిత గమ్యమో అది గుర్తించి అలా నడుచుకోటానికి
Page 290