జ్ఞాన యోగము
భగవద్గీత
సంభవించేది. అది మన విషయంలో మనం చూస్తూనే ఉన్నాము. అఖండంగా జ్ఞానం ప్రకాశిస్తున్నప్పు డీ శ్వరుడి విషయంలో ఎలా చెల్లుతుంది. అయినా జన్మించా నంటాడేమిటి. జన్మ కాదది. ఆభాస మరణం కాదది. అదీ ఆ భాసే. అందుకనే జీవుడిది జన్మ అయితే ఈశ్వరుడిది అవతారమన్నారు. వీడిది మరణమైతే ఆయనది నిర్యాణమన్నారు పౌరాణికులు. తెలిసి వచ్చాడు ఈశ్వరుడు. తెలియక వచ్చాడు జీవుడు. తెలిసి వచ్చాడు గనుకనే తెలిసే పోతాడాయన. తెలియక వచ్చాడు గనుక తెలియకుండానే పోతాడీ మానవుడు. ఇంతకూ జ్ఞానాజ్ఞానాలలో ఉన్నదున్న తేడా అంతా. ఇదుగో ఈ తేడా ఉండటం మూలాన్నే దేహినోస్మిన్ యధాదేహే అనే తరువాతి శ్లోకంలో జీవుడికి జనన మరణాలు తప్పనిసరి అని చెప్పాడు పరమాత్మ. అయితే అంతకు ముందు నత్వేవాహమనే శ్లోకంలో ఆమాట ఎందుకు చెప్పాడు ఎవరికీ జనన మరణాలు లేవని. దానికింతకు పూర్వమే సమాధాన మిచ్చి ఉన్నాము. ఒకటి ప్రత్యగాత్మ దృష్టితో చెప్పిన మాట అని - మరొకటి జీవాత్మ దృష్టితో చెప్పినదని. కాబట్టి ఇక ప్రశ్న లేదు.
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా || 6 ||
సరే బాగానే ఉంది పరిష్కారం. కాని ఒక సందేహం. ఈశ్వరుడికి జీవుడిలాగా జనన మరణాలు లేవని గదా సిద్ధాంతం చేశారు. అలాంటప్పుడీ
Page 287