జ్ఞాన యోగము
భగవద్గీత
పరమాత్మ అనే భావం లేదు. అతనికే లేదంటే ఇక శిశుపాల జరాసంధాదుల మాట చెప్పేదేముంది. ఎక్కడో లేరు వారంతా. మనమే. మనలోనే అర్జునులూ ఉన్నారు. శిశుపాలాదులూ ఉన్నారు. కొంద రాస్తికులైతే కొందరు నాస్తికులు. నాస్తికు లసలే లేడు పరమాత్మ అంటే ఆస్తికులున్నాడు గాని అతడీ కనిపించే వ్యక్తి గాదు. ఎక్కడో మనకతీతమైన లోకాలలో ఉన్నాడని భావిస్తుంటారు. ఇదుగో మన బోటి అర్జునులంతా ఇలాటి ఆస్తికులే.
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప || 5 ||
అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకొని అందరికీ ఇప్పుడు సమాధాన మిస్తున్నాడు భగవానుడు. బహూనిమే వ్యతీతాని జన్మాని తవచ నాయనా నీకూ నాకూ కూడా ఎన్నో జన్మలు గడచిపోయా యిప్పటికి. చూచారా ఈమాట. మానవుల లాగే భగవానుడు జన్మిస్తూనే ఉన్నాడంటే మనలాగే ఆయనా జన్మ తప్పించుకోలేక పోతున్నాడనే గదా. అలాంటప్పు డాయనకూ మానవులకూ తేడా ఏముంది. ఇది ఒక ప్రశ్న.
మరొక ప్రశ్న ఏమిటంటే అసలు దేవుడేమిటి. జీవుడేమిటి. ఎవరికీ లేవు జనన మరణాలు. ఇది స్వయంగా ఆయన చెప్పిన మాటే. నత్వేవాహం జాతునాస మనే చోట ఏమన్నాడు. నేనూ నీవూ ఈ దుర్యోధనాదులూ మొదటి నుంచీ ఉంటూనే ఉన్నాము. ఇక మీదా ఉండబోతామని చెప్పాడా లేదా. అంటేఎవరికీ జనన మరణాలు లేవనేగా.
Page 285