జ్ఞాన యోగము
భగవద్గీత
తెగిపోతే దాన్ని ప్రత్యుద్ధరణ చేయటాని కందరికీ ఉండదు సామర్థ్యం. భూత భవిష్యత్తుల నాకళించుకోగల దివ్యదృష్టి ఉండాలా వ్యక్తికి. వాడే ఋషి. క్రాంతదర్శీ మహర్షిః అన్నారు. దేశకాలాల నతిక్రమించి చూడగలవాడే ఋషి, యుగాంతేం తర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః లేభిరే తపసా పూర్వమని పెద్దలు చెప్పిన మాట. కాలగర్భంలో కలిసి గుప్తమైన రహస్యాలను బయటపెట్టటానికి గొప్ప దర్శన సామర్ధ్యముండాలి. అది తపశ్శక్తి వల్ల గాని సాధ్యం కాదు. విశ్వామిత్రాదులు మంత్ర ద్రష్ట లయ్యారంటే దానికిదే హేతువు.
అలాంటప్పుడు యోగేశ్వరేశ్వరుడైన పరమాత్మ దార్శనికుడు కావటంలో ఆశ్చర్యమేముంది. ఎంత గుప్తమైన విశ్వరహస్యమైనా చూడగలడు చెప్పగలడు. దీన్నిబట్టి మరొక సత్యం కూడా తెలుస్తున్నది మనకు. సృష్టిలో ప్రతి ఒక్కటీ ఉన్నదేగాని లేనిది గాదు. మహా అయితే అవ్యక్తంగా ఉన్నది వ్యక్త మవుతున్నది. అంత మాత్రమే. దర్శించే సామర్ధ్య మున్న వాడి కది వ్యక్త మవుతుంటుంది. అది లేని వాడికెప్పటికీ అవ్యక్తం గానే ఉండిపోతుంది. అభావమంటూ ఏదీలేదు. అంతా సద్రూపుడైన పరమాత్మే అయినప్పు డ సద్రూప మొకటి ఉండటాని కాస్కారమెక్కడిది.
అంచేత పరమాత్మ ఇప్పుడా నష్టమైన యోగాన్ని బయటపెడుతున్నా డర్జునుడి కంటే అర్జునుడికా యోగ్యత ఉందా. ఉంది గనుకనే చెబుతున్నానంటాడు. భక్తిసి మేసఖా చేతి రహస్యం హ్యేత దుత్తమమ్.
Page 282