జ్ఞాన యోగము
భగవద్గీత
గలరు దేశాన్ని. వారు బ్రహ్మాన్ని కాపాడితే అది దేశాన్ని కాపాడుతుంది. బ్రహ్మ క్షత్రియులకే ఉందా సామర్ధ్యమంటారాయన. బ్రహ్మమేమిటి క్షత్రమేమిటి.
బ్రాహ్మణుడు జ్ఞాన శక్తికీ క్షత్రియుడు క్రియాశక్తికీ సంకేతాలు. శరీర మెలాంటిదో దేహ మలాంటిది. మనస్సూ ప్రాణం కలిసి పని చేయకపోతే శరీరం పనిచేయదు. ఇందులో మనస్సు లాంటివాడు బ్రాహ్మణుడు సలహా ఇస్తుండాలి. ప్రాణంలాంటి క్షత్రియ జాతి తదనుగుణంగా పాటించాలి. అప్పుడే ఇంద్రియాలనే ప్రజలు తమ తమ కర్తవ్యం పాటిస్తారు - శరీరమనే దేశం కూడా సుభిక్షమై రాణిస్తుంది. అందుకే మొదటి నుంచీ బ్రాహ్మణులే మంత్రులయి రాజులకు సలహా ఇస్తూ వచ్చారు. వారి సలహా మేరకు వీరు దేశాన్ని పాలిస్తూ వచ్చారు. అలా కాకుంటే కేవలం రాజులేగాని వారు రాజర్షులు కాలేరు. రాజనే మాటలో క్షత్రియత్వమూ. ఋషీ అనే మాటలో బ్రాహ్మణత్వమూ తొంగిచూస్తున్నది. ఇది భారతీయులకే గాదు యవన దేశీయులకు కూడా ఉంది ఈ అభిప్రాయం. Philosopher Kings అని వారు పెట్టిన పేరు. రాజు జ్ఞాని అయి ఉండాలి. లేకుంటే నిర్లిప్తంగా నిష్పక్షపాతంగా చేయలేడు పాలన నిరంకుశంగా స్వార్ధపరుడయి చేసి తాను చెడి ప్రజాజీవితాన్ని చెడగొడతాడు.
అంచేత బ్రహ్మక్షత్ర అనే మాట లిక్కడ జాతిపరంగా తీసుకోరాదు. గుణపరంగా భావించాలి. యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓ దనః
Page 280