#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

వైవస్వతుడనే మనువుకు బోధించాడట. మానవులకు మూలపురుషుడు మనువు. ఆ మనువు ఇక్ష్వాకవే అబ్రవీత్ - ఇక్ష్వాకువనే కుమారుడికి చెప్పాడట.

  ఇక్కడ సూర్యుడు - మనువు - ఇక్ష్వాకు వనే మాటల కంత రార్ధం చెప్పినా చెప్పుకోవచ్చు. వివస్వంతుడంటే బాగా వెలిగిపోయే బుద్ధితత్త్వం. మనువంటే మనస్తత్త్వం. ఇక్ష్వాకు ఇక్షువులాగా మధురమైన శబ్ద స్పర్శాదుల వెంటబడిపోయే ఇంద్రియ తత్త్వం. వీటికి జ్ఞానబోధ అబ్బిందంటే అవి మానవుడి మార్గాని కడ్డు తగలకుండా మోక్షపురుషార్ధానికి సాధనాలుగా పనిచేస్తాయని భావం. ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః ఇలా గురుశిష్య పరంపరగా లభించిన ఈ జ్ఞానయోగం రాజర్షులు మాత్రమే గ్రహించ గలిగారు మొదటినుంచీ అంటాడు పరమాత్మ.

  రాజర్షులేమిటి. రాజాచ ఋషిశ్చేతి రాజర్షిః రాజయి ఋషి అయిన వాడెవడో వాడు రాజర్షి. విశ్వామిత్రుడి లాంటివాడు. జనకుడిలాంటి వాడు. ఇందులో ఒక గంభీరమైన భావమిమిడి ఉంది. అది భాష్యకారులే వివరించారు. జగత్పరిపాల యితౄణాం క్షత్రియాణాం బలాధానాయ. తేన యోగ బలేన యుక్తాః సమర్ధా భవంతి బ్రహ్మ పరిరక్షితుమ్ - బ్రహ్మ క్షత్రే పరిపాలితే జగ త్పరి పాలయితు మలమ్. దేశాన్ని పరిపాలించ వలసినవారు క్షత్రియులు. వారికి కేవలం దేహబలముంటే చాలదు. దాని కతీతమైన బుద్ధిబల ముండాలి. అది యోగం వల్ల గాని రాదు. అలాంటి యోగబల ముంటే వారు న్యాయంగా నిష్పక్షపాతంగా నిర్లిప్తంగా పరిపాలించ

Page 279

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు