కర్మ యోగము
భగవద్గీత
మానవుడి గుణమని బృహదారణ్యక మెప్పుడో చెప్పింది అందుకే మాగృధః అని హెచ్చరించిం దీశావాస్యం. కస్యస్విద్ధనం అంతా నీ దేనీ విభూతే అయినప్పు డెందుకాశ పడతావని చీవాట్లు పెట్టింది.
ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే |
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ || 40 ||
అయితే ఇంత మనల నలజడి పాలు చేస్తున్నదంటే దీనికింత బలమెలా వచ్చింది. పరిశుద్ధమైన జ్ఞానాన్నే ఇది ఆవరిస్తున్న దంటే ఎంత ధైర్యం దీనికి. దేని ఆసరా చూచుకొని ఇది మనమీద దాడి చేస్తున్నదని ఇప్పుడు ప్రశ్న. దాని కిస్తున్నది గీత సమాధానం. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠాన ముచ్యతే. పంచేంద్రియాలూ వాటికధి పతియైన మనస్సూ - దానికి పైన ఉన్న బుద్ధీ - ఇవీ దానికి నిలయం. ఇందులో మనసంటే సంకల్ప వికల్పాత్మక మైన వృత్తులు. బుద్ధి వృత్తులను లోపల ఉంచుకొన్న జ్ఞానం. విజ్ఞానమని కూడా పేరు దానికి - ఇది వృత్తులను తనలో దాచుకొన్నది గనుక పరిశుద్ధమైన జ్ఞానం కాదు. సమయం చూచి వృత్తులను బయట పెడుతుంది. ఇదుగో ఈ ఏడూ కామమనే పిశాచిని తిండిపెట్టి పోషిస్తున్నాయి. వీటి ఆశ్రయం చూచుకొని అది విజృంభిస్తున్నది.
ఏతైర్వి మోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినమ్. వీటి బలంతో అది మొదట మానవుడి వివేక జ్ఞానాన్ని కప్పి వేస్తుంది. తరువాత వాడికి వ్యామోహం కల్పించి విమూఢుణ్ణి చేస్తుంది. అలాంటప్పుడే మనం జాగ్రత్త వహించాలి. అది విజృంభించటం ప్రారబ్ధం కొద్దీ జరుగుతుంటే మానవుడు
Page 269