విషాద యోగము
భగవద్గీత
రాయి చేరామంటే మొదటిది అందులో కలిసి వస్తుంది. మూడవది చేరామంటే రెండవది కూడా అందులో చేరిపోతుంది. అలాగే మోక్షసాధన మార్గంలో కూడా సాధకుడు పయనిస్తున్నాడిప్పుడు. అందులో ఉపనిషత్తులు దాటి సూత్రాల దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి శ్రవణమే గాక మననం కూడా చేసిన వాడయ్యాడు. మరి భగవద్గీత దగ్గరికి వచ్చే సరికి శ్రవణ మననాలతో పాటు నివిధ్యాస కూడా అందుకొన్నాడు. అంటే భగవద్గీతలో మూడు భూమికలూ అందుకోగలడన్న మాట. అప్పటి కొక్క భగవద్గీత బాగా మధిస్తే చాలు సాధకుడు. మరేది చూచినా చూడకపోయినా అంత నష్టం లేదు. అదే ఉపనిషత్తు అదే బ్రహ్మమీమాంసా అదే భగవద్గీత. మూడింటి వ్యవహారమూ ఇదే నిర్వహిస్తుంది. అన్ని రోగాలకూ ఇదే చేయగలదు చికిత్స. లోకంలో కూడా చూడండి. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డుంటాడు స్పెషలిస్టు. మంచిదే. కాని ఏ వ్యాధికైనా చికిత్స చేయగల సామర్ధ్య మున్న డాక్టరు కూడా ఎక్కడో ఒకడు లేకపోడు. అలాగే భగవద్గీత ఒక జనరల్ డాక్టరు. అన్ని రోగాలకూ బ్రహ్మాండమైన ఔషధాన్ని ప్రసాదించి నయం చేసే మహావైద్యుడు. వైద్యోనారాయణో హరిః అని ముందే సూచించాము గదా. మరి భగవానుడు కాకపోతే ఎవడు చేయగలడు. ఎవడు రూపుమాపగలడీ భవరోగాన్ని మానవులకు.
భగవద్గీతా ప్రణాళికే చాలా చిత్రమైనది. సర్వోపనిషత్సార మన్నందుకు ఉపనిషత్తుల నమూనాలోనే తయారయింది. ముఖ్యంగా
Page 26