విషాద యోగము
భగవద్గీత
మంటారు పెద్దలు. కానీ వచ్చిన ఇబ్బంది ఏమంటే శ్రవణ మననా దులు మూడూ ఉన్నా అవి చాలా గుప్తంగా ఉన్నాయక్కడ. స్పష్టంగా బయటపడి కనపడవు. బాగా విమర్శించి చూచే ఉత్తమాధికారి కైతేనే అవి ప్రకటమై కనిపిస్తాయి. అలాంటి వాడి కుపనిషత్తే చాలు. ఇక దేని సహాయమూ అక్కరలేదు.
పోతే అందరూ అలాటి కుశాగ్రబుద్ధు లుండరు. మంద మధ్య మాధికారులే నూటికి తొంబది మంది. అలాటి పాఠకులకు కావలసి వస్తాయి బ్రహ్మసూత్రాలూ భగవద్గీతా. అలాగని అవి ఏవో క్రొత్త విషయాలు మనకు చెబుతాయని కాదు. ఉపనిషత్తులు చెప్పనిదంటూ ఏదీలేదు. అయితే తద్ద్వారా శ్రవణం చేసిన విషయం మనకు బాగా పట్టకపోతే అందులో దాగి ఉన్న ఉపపత్తులను చక్కగా సమన్వయించి చూపటానికి వచ్చాయి బ్రహ్మసూత్రాలు. కనుకనే వేదాంత వాక్య మీమాంసా అని పేర్కొన్నారు దాన్ని బాదరాయణులు. అలాగే ఉద్దేశించి వ్రాశారు సూత్రాలను. కాగా భగవద్గీత కూడా క్రొత్త విషయాన్ని ఏదీ చెప్పదు. ఉపనిషత్సారమే భగవద్గీత. ఉపనిషత్తులు గోవులైతే వాటిని పిండగా వచ్చిన క్షీరమే భగవద్గీత అని గదా వర్ణించారు. మరి ఎందుకీ భగవద్గీత అంటే ఉపనిషత్తులలో చాలా నిగూఢంగా ఉన్న అనుభవ రహస్యాలను బయటపెట్టటానికి.
ఇంకా ఒక రహస్యమేమంటే మనమెక్కడికైనా ప్రయాణం చేస్తున్నామంటే ఒక్కొక్క మైలురాయీ దాటి పోతుంటాము. రెండవ మైలు
Page 25