విషాద యోగము
భగవద్గీత
మనకు బోధిస్తున్న నిది ధ్యాసనా రహస్యం. దీనితో విపర్యయమనే ఆఖరి వ్యాధి కూడా నిర్మూలమై పోయి మోక్షమనే మహాఫలం జీవించి ఉండగానే సిద్ధించి మానవుడు జీవన్ముక్తినే చవి చూడగలడు. అలా చూస్తే ఇక ఏ సమస్యా లేదు జీవితానికి.
అయితే ఇప్పుడొక ఆ శంక. శ్రవణ మనన నిది ధ్యాసలనేవి మూడూ ఉపనిషత్తే చెప్పింది గదా. అదే గదా యాజ్ఞవల్క్యుడు మైత్రేయి కుపదేశించాడని ఉదాహరించారు. అప్పటికి వాటిని గురించిన వివరణ కూడా అందులోనే వస్తుంది గదా. ఇలా మొదటి ప్రస్థాన మైన ఉపనిషత్తులోనే సాధన మార్గమంతా మనకు లభిస్తున్నప్పుడిక ఈ బ్రహ్మసూత్రాలు భగవద్గీత మనకు క్రొత్తగా చెప్పేదేమిటి. అవసరమేమిటి. ఉపనిషత్తుల వల్లనే సమస్తమూ సాధకుడైనవాడు గ్రహించవచ్చు గదా అని ప్రశ్న.
వాస్తవమే. సిద్ధాంతమూ సాధనా అంతా ఉపనిషత్తులోనే వర్ణించబడ్డాయి. సందేహం లేదు. అందువల్లనే అసలు ఉపనిషత్తులే శాస్త్రమని పేరు వచ్చింది. సమస్యా- పరిష్కారమూ రెండూ సాంగోపాంగంగా వర్ణించి చెప్పేదేదో అదీ శాస్త్రమంటే. శాస్తీతి శాస్త్రమ్. కుండబద్దలు కొట్టినట్టు నిర్మొహమాటంగా తెగేసి చెప్పేది గనుక దానికి శాస్త్రమని పేరు వచ్చింది. ఆ పని ఉపనిషత్తే చేస్తున్నది గనుక వేదాంతమనే మాట వేదానికి చివరి భాగమని వాచ్యార్ధం చెప్పుకొన్నా మానవుడి విజ్ఞానానికే అంతం లేదా పర్యవ సానమని లక్ష్యార్ధం కూడా చెప్పుకో
Page 24