కర్మ యోగము
భగవద్గీత
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి |
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి || 33 ||
ఎందుకండీ ఈ మానవులు మీ మాట వినటం లేదు. ఎందుకు గాను మీరిచ్చిన సలహా పాటించక స్వధర్మానికి స్వస్తి చెప్పి పరధర్మాన్ని పట్టుకు పోతున్నారు. మీ మార్గంలోనే సర్వమానవులూ బ్రతుకుతున్నారని మీరే చెప్పారు గదా. అలా మీ మార్గంలోనే ఉండి మీరంటే భయం లేకుండా ఎలా బ్రతుకుతున్నారని అడిగితే భగవానుడు మనకు సమాధాన మిస్తున్నాడు.
ప్రతివాడికీ వాడి ప్రకృతి అని ఒకటి ఉంటుంది. ప్రకృతిర్నామ పూర్వకృత ధర్మాధర్మాది సంస్కారః వర్తమాన జన్మాదా వభివ్యక్తః అని అర్ధం చెప్పారు భాష్యకారులు. ప్రకృతి అంటే ఇది త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి కాదు. ఇంతకు ముందు జన్మలలో మనం చేసుకొన్న పుణ్యపాపకర్మల తాలూకు సంస్కారం Impression. అది ఇప్పుడీ జన్మలో ప్రారబ్ధ రూపంగా బయటపడి మనమీద పని చేస్తుంటుంది.
అంచేత వస్తుతః మానవులంతా భగవన్మార్గంలోనే బ్రతుకుతున్నా వాళ్ల బుద్ధి కలా తోచటం లేదు. ప్రారబ్ధ కర్మ అలా తోచనివ్వదు. తోచనివ్వక ఏం చేస్తుంది. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి వారి నా మార్గానికి తప్పిస్తుంది. ఎవడి ప్రారబ్ధానికి తగినట్టే వాడు నడచుకొంటాడు. అలాగే ఆలోచిస్తాడు. అలాగే మాటాడుతాడు. అలాగే ప్రవర్తిస్తాడు. అంతకు పయి ఆలోచన రానేరాదు. ఆలోచనే రాక పోతే ఇక మాటా నడతా అనే మాటేముంది. అవీ దానికి తగినట్టే ఏడుస్తాయి. పోనీ ఇది అజ్ఞానికే
Page 256