విషాద యోగము
భగవద్గీత
ఎవరా వైద్య శిఖామణి. మరి ఎవరు వైద్యోనారాయణో హరిః పరమాత్మే ఆ వైద్యుడు. ఆయన సగుణ రూపమైన కృష్ణ భగవానుడే. ఆయనగారి ముఖతః వెలువడ్డ గీతామృతమే ఆ దివ్యౌషధం. నిది ధ్యాసనా రూపమైన ఈ అమృతాన్ని సేవిస్తే మనకిక జనన మరణాలనే చింతే లేదు. అమృతత్వమే సిద్ధిస్తుంది. యద్ జ్ఞాత్వా మృత మశ్నుతే అని భగవద్గీతే ఇస్తున్నది మనకుహామీ. అది ఎలాగని అడిగితే అసలు మీరు జన్మిస్తే గదా మరణించటానికి. నత్వేవా హం జాతు నాసం - నత్వం నేమే జనాధిపా-నేనెలా జన్మించ లేదో మీరూ అలాగే జన్మించలేదు. న చైవ న భవిష్యామః - జన్మించకనే పోతే మరణిస్తామనే ప్రశ్నేముంది అని సమాధానమిస్తున్నది.
అది ఎలా గని అడిగితే శరీర స్ట్రోపి కాంతేయ నకరోతి నలిప్యతే ఈ శరీరంలో ఉన్న దెవరను కొంటున్నావు. ఆ ఈశ్వరుడే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు - అలాంటప్పుడే జీవుడు గానీ ఎలా జన్మిస్తాడు. ఎలా మరణిస్తాడు. అజ్ఞానేనా వృతం జ్ఞానం తేన ముహ్యంతి. కేవల మీ సత్యాన్ని గుర్తించకనే జనన మరణాల పాలవుతున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమ్ - గుర్తించారో మృతు డొకడూ లేడు. ప్రతివాడూ అమృతుడే. ఏమిటా జ్ఞానమంటావా చెబుతున్నది గీత. సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్షతే. ఎక్కడికో వెళ్ళనక్కర లేదు. ఇక్కడే మనకు కనిపించే అనిపించే సమస్త పదార్ధాలలోనూ పరచుకొని ఉన్న ఒకే ఒక భావాన్ని వెదికి పట్టుకొంటే చాలు. అదే జ్ఞానం.
Page 22