#


Index


విషాద యోగము భగవద్గీత

విశేష రూపాలుగా భాసిస్తున్నదో - అలాగే ఆత్మ అనాత్మగా భాసిస్తున్నది. కాబట్టి సర్వమూ ఆత్మేనని చివరకు ప్రతిపాదించా రాయన.

  దీనితో ఉపనిషత్తులు వర్ణించిన ఏకాత్మ భావం స్థూణా నిఖనన న్యాయంగా సాధకుడి మనసులో బాగా గట్టిపడింది. ఉపనిషత్తుల ద్వారా శ్రవణం చేసిన విషయంలో ఎలాంటి సందేహ మేర్పడినా దాన్నిఈ బ్రహ్మసూత్రాలు మననం చేస్తేచాలు. నిర్మూలమైపోయి మనకు నిశ్చయ జ్ఞాన మేర్పడుతుంది. శ్రవణం వల్ల అజ్ఞానమనే రోగం తొలగిపోయి ఆత్మజ్ఞానమనే ఆరోగ్యం చేకూరితే మననం ద్వారా సంశయమనే రుగ్మతపోయి నిశ్చయమనే ఫల మేర్పడిందన్న మాట. అయినా పూర్తిగా పరిష్కారం చిక్కలేదు మనకు. నిశ్చయ జ్ఞాన మేర్పడ్డా అది కేవలం మనస్సులోనే. దైనందిన జీవితంలో అది ప్రవేశించడం లేదు. జ్ఞానం జ్ఞానమే - జీవితం జీవితమే అయి కూచుంది. అలాగైతే తీర్ధానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదమన్న సామెతే అవుతుంది. పరిపూర్ణత లేదు. సిద్ధాంతం అనుభవంగా మారినప్పుడే పరిపూర్ణత. అదే మన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం. అంతవరకూ విపర్యయమనే వ్యాధి మనలను వదలిపెట్టదు. విపర్యయమంటే ముందే మనవి చేశాము తల్లక్రిందులు వ్యవహారమని. అంతా స్వరూపమేనని మానసికంగా గుర్తించామే గాని ప్రతిక్షణమూ దాని కనుగుణంగా జీవితం సాగించగలమా. వ్యవహారంలోకి వచ్చే సరికి ఆత్మ అనాత్మ అనే భేదం తన్ని మిత్తంగా ఏర్పడే సుఖదుఃఖాదులూ కొట్ట వచ్చినట్టు కనిపిస్తూంటాయి. ఇక సమస్య ఏమి పరిష్కార మయిందని.

Page 20

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు