సాంఖ్య యోగము
భగవద్గీత
ఈ విధంగా పంచేంద్రియ వ్యాపారాలనూ మనో వ్యాపారాన్నీ అన్నింటినీ బహిర్ముఖంగా ప్రసరించకుండా అంతర్ముఖం చేసుకొని తన ఆత్మ స్వరూపాన్ని తాను గుర్తించి అందులోనే నిలకడ చెందిన స్థిత ప్రజ్ఞుడికిక అజ్ఞాన మనేది ఏ కోశానా లేదు. అజ్ఞాన స్పర్శ కూడా లేని ఆస్థిత ప్రజ్ఞుడి వ్యవహారమెలా ఉంటుందో - మిగతా అజ్ఞులైన లోకులకూ వాడికీ ఉన్న తేడా ఏమిటో - ఇప్పుడు గీత మనకద్భుతంగా వర్ణించి చెబుతున్నది. యా నిశాసర్వ భూతానాం - తస్యాం జాగర్తి సంయమీ. మామూలు మానవుడేది రాత్రి అనుకొని చూస్తాడో - జ్ఞాని కది కేవలం పగలు. యస్యాం జాగ్రతి భూతాని - సానిశా పశ్యతో మునేః మరి వాడేది పగలుగా భావిస్తాడో అది జ్ఞాని అయిన వాడికి రాత్రి. ఇదీ ఈ శ్లోకాని కర్ధం.
ఎంత విడ్డూరంగా ఉన్నదీ భావం మనం వింటుంటే. అందరూ లోకంలోనే బ్రతుకు తున్నప్పు డొకడికి రాత్రి అయి మరొకడి కది పగలెలా అవుతుంది. అలాగే ఒకడికి పగలయి ఇంకొకడి కదే రాత్రి ఎలా అవుతుంది. లోకానుభవానికే విరుద్ధం గదా ఇది. పగలు పగలే రాత్రి రాత్రే. ఎవడికైనా అలాగే కనిపించాలి కొకటీ కనిపించటమ సంభావ్యం. కాలం. ఒకడి కొకటీ ఒకడి
Page 192