సాంఖ్య యోగము
భగవద్గీత
ఇది ఎలాటిదంటే వాయుర్నావమి వాంభాసి. ఒక పడవ సముద్రంలో పయనిస్తున్నది. వాయువను కూలంగా వీస్తుంటే పరవాలేదు. తీరం దాకా క్షేమంగా వెళ్లగలదది. అలాకాక ప్రతికూలమైన ఝంఝా మారుతం వీస్తూంటుం దను కోండి. అది దాన్ని తీసుకుపోయి దూరంగా పారేస్తుంది లేదా సముద్రంలోనే ముంచి పారేస్తుంది. ఇక తీరం చేరే దేముందా నావ. అలాగే ప్రతికూల వాయువులయి కూచున్నాయి ఈ చక్షురా దీంద్రియాలు. ఆత్మ తీరాన్ని చేర్చటానికి బదులిది మనస్సనే నావ న నాత్మ ప్రపంచ సాగరంలో ముంచేస్తాయి.
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 68 ||
అంచేత ఇలాంటి ఉపద్రవం దాపురించకుండా మానవుడు క్షేమంగా ఈ సంసార సాగరంలో నుంచి బయట పడాలంటే ఆత్మాభిముఖంగానే సాగించాలి ప్రయాణం. అలా సాగించాలంటే దానికేకైక సాధనమైన మనస్సు నదుపులో పెట్టుకోవాలి. మనసు నదుపు చేయాలంటే అంతకు ముందీ ఇంద్రియాల నయిదింటినీ అరికట్టుకొంటూ రావాలి. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః స్పర్శాదులే ప్రమాదకరం. వాటిలో ఈ ఇంద్రియా లెంతవరకో అంతవరకే గాని అతిగా ప్రవర్తించగూడదు.
Page 189