సాంఖ్య యోగము
భగవద్గీత
ఎడతెగ కుండా పెరిగిపోతూనే ఉంటుంది. తృష్ణ అనేది తీరితే సరిపోయె గాని ఇలా తెగకుండా సాగుతూ పోతే శాంతి ఎలా లభిస్తుంది మానవుడికి అని ప్రశ్నిస్తున్నారు ఆచార్యుల వారు. కనుక శాంతి సౌఖ్యాలకు నోచుకోవాలంటే ఇంద్రియాల కుండే విషయవాంఛలను ముందు అదుపులో పెట్టుకోక తప్పదు.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి || 67 ||
లక్ష్యం మీద బుద్ధి కేకాగ్రత లేకపోతే ఆ బుద్ధికి ప్రసాద గుణమబ్బదని ఇంతకు ముందు పేర్కొన్నారు గదా. దానికి కారణమేమని ప్రశ్న వస్తే చెబుతున్నది గీత - ఈ ఇంద్రియాలే దానికి మూలకారణమని. ఎలాగంటే ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే. చక్షురాదీంద్రియాలు వాటి వాటి క్షేత్రాలలో ప్రవర్తిస్తున్నప్పుడీ మనస్సు ఊరక కూచోదు. ఇది కూడా వాటి వెంటబడి పోతుంటుంది.
పడిపోవట మంటే ఏమిటి. ఇంద్రియ విషయా లైదే అయినా అనంత కోటి అవతారాలెత్తు తుంటాయవి. వాటినన్నింటినీ ఆ ఇంద్రియా లాకళించుకోవాలని చూస్తుంటే వాటి ద్వారా అన్నింటినీ అనుభవిస్తే బాగుండునని మనసు పరిపరివిధాల పోతుంటుంది. నిర్వికల్ప స్థితి తప్పి మనసెప్పటి కప్పుడు సవికల్పంగా మారిపోతుంది. నిర్వికల్పమంటే అది
Page 187