సాంఖ్య యోగము
భగవద్గీత
ఆత్మ భావన అనేది అంత సులభంగా పట్టుపడదు. నాస్తి బుద్ధి రయుక్తస్య - సమాధి లేనివాడికది ఏమాత్రమూ అలవడదు. సమాధి అంటే ఏదో గాదు. తదేకాగ్రమైన దృష్టి. అప్పుడే సర్వత్రా పరుచుకొన్న ఆత్మ అనే అధిష్ఠానం Base వాడి దృష్టికి గోచరిస్తుంది. న చా యుక్త స్యభావనా అసలు ఏకాగ్రతలేని వాడికాత్మ జ్ఞానం తాలూకు అభినివేశమే కలగదు. అలాగే నచాభావయత శ్శాంతిః - జ్ఞానంలో అభినివేశం Intensive feeling పెట్టుకోని వాడికి శాంతి అసలే లేదు. అశాంతస్య కుతస్సుఖమ్. మరి శాంతికి నోచుకోని వాడు సుఖాన్ని ఎలా ఆసించగలడు. శాంతము లేక సౌఖ్యము లేదన్నారు పెద్దలు.
దీనిమీద భాష్యం వ్రాస్తున్నారు భగవత్పాదులు వినండి. ఇంద్రియాణాంహి విషయసేవా తృష్ణాతః నివృత్తి ర్యా తత్సుఖమ్. ఇంద్రియాల కాయా విషయాలను సేవిద్దామనే తృష్ణ వల్ల కలిగే సుఖం సుఖం కాదు. ఆ భావం నుంచి తొలగినప్పుడే సుఖం. అంతేగాని నవిషయ విషయా తృష్ణా. విషయాల వెంటపడి పోవటం కాదు. సుఖంగా కనిపిస్తున్నా విషయ జన్యమైన సుఖం సుఖం కాదు. దుఃఖమేవ హిసా అది కేవలం దుఃఖమే. ఎందుకంటే న తృష్ణాయాం సత్యాం సుఖ స్యగంధ మాత్ర మ ప్యుపపద్యతే. విషయాలు ఒకటి గాదు. రెండుగాదు. ఎడతెగకుండా మనలను భ్రమ పెడుతూనే ఉంటాయి. తృష్ణ కూడా దానితో పాటు
Page 186