#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  స్మృతి భ్రంశా ద్బుద్ధినాశః అలాంటి బంగారంలాంటి ఆత్మస్మృతినే ఎప్పుడు కోలుపోయాడో మానవుడిక. వాడికి బుద్ధే పనిచేయదు. వివేచన చేసే శక్తే లేకుండా పోతుంది. బుద్ధి జీవుడని పేరు మానవుడికి. సృష్టిలో మరి దేనికీ లేని బుద్ధి అనే నిక్షేపం వీడికి ప్రసాదించాడు ఈశ్వరుడు. అమూల్యమైన ఆ ధనాన్ని జారవిడుచు కొన్నాడంటే ఏమని పేర్కొనాలి వాణ్ణి. బుద్ధినాశా త్ప్రణశ్యతి. బుద్ధి నశిస్తే ఇక మానవుడే నశించినట్టు. వాడిక లేడు. వ్రాస్తున్నారు భగవత్పాదులు వినండి.

  తావదేవహి పురుషః యావదంతః కరణం తదీయం కార్యాకార్య వివేక యోగ్యం. తదయోగ్యత్వే నష్ట ఏవ పురుషో భవతి. అతస్త స్యాంతః కరణస్య బుద్ధేర్నాశా త్ప్రణశ్యతి. పురుషార్ధా యోగ్యో భవ తీత్యర్ధః. ఎంతవరకీ మానవుడి బుద్ధి కార్యాకార్య వివేచనా సమర్ధమయి ఉంటుందో అంతవరకే వీడు మానవుడు. అలాంటి యోగ్యత వీడి బుద్ధికెప్పుడు నశించిందో అప్పుడే వీడు నష్టమయి పోయాడు. నష్టమయ్యాడంటే అసలే కన్నుమూశాడని కాదు. పురుషార్ధ సాధనకే పనికి రాకుండా పోతాడు. అంటే బ్రతికి ఉన్నా చచ్చిన వాడితో సమానం.

రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి || 64 ||

Page 181

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు