సాంఖ్య యోగము
భగవద్గీత
నేను వేరుగా లేను. ఆ సచ్చిద్రూపమే నా స్వరూపమనే భావంతో ఆసీత సమహితుడయి ఉండాలట మానవుడు.
వశేహి యస్ప్రేంద్రియాణి అలా ఉండ గలిగితే ఇంద్రియాలు లేవు ఏమీ లేవు. కుక్కలూ పిల్లుల లాగా అవి నీకు వశవర్తులయి మెలగుతాయి. తోకాడించలేవు. అసలు నీవైపు తేరి చూడటానికే భయపడతాయి. ఏపని అయినా నీవు చేయమంటే చేస్తాయి. లేదంటే మానేస్తాయి. నీ చెప్పు చేతలలో ఉంటాయి. వాటికి నీవు బానిస కావటం లేదు. అవే నీకు బానిస లయి బ్రతుకు తుంటాయి. అసలు వాటికి జ్ఞానమా పాడా. జ్ఞానమనేది నీ సొమ్ము. నీకొక సంకల్పం కలిగి పురమాయిస్తేనే పనిచేస్తాయి. లేకుంటే చచ్చినట్టు పడి ఉంటాయి. అలాంటి వాటిని చూచి నీవు బెదిరి పోవట మేమిటి. వాటికి దాసోహ మనట మేమిటి. సిగ్గు చేటు. కాబట్టి అవి నీమీద గాదు నీవు వాటి మీద అధికారం కొనసాగించి నప్పుడే ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ప్రజ్ఞ ప్రతిష్ఠ చెందుతుంది.
ఇది మనమింతకు ముందు పేర్కొన్న ప్రశ్నలలో మూడవదానికి జవాబు. కిమా సీత అని గదా మూడవ ప్రశ్న. స్థిత ప్రజ్ఞు డెలా ఉంటాడని అడిగితే ఇలా ఉంటాడని సమాధాన మిస్తున్నదీ శ్లోకం. యుక్త ఆసీత అని నిత్యమూ తన జాగ్రత్తలో తానుంటాడు.
Page 178