సాంఖ్య యోగము
భగవద్గీత
మనస్సు నని పేర్కొంటున్నది గీత. గమనించండి. శరీరంగాదు. కరచరణా ద్యవయవాలు గావు. చక్షురాదీంద్రియాలు గావు. మానవుడంటే వాడి మనస్సే. మన ఏవమను ష్యాణాం కారణం బంధ మోక్షయోః అన్నారు పెద్దలు. ఇటు బంధానికి గానీ అటు మోక్షానికి గానీ మనస్సే సాధనం. దాని విషయంలో పరాకుగా బతికామంటే అది బతుకే గాదు మానవుడికి. జీవచ్ఛవం లాంటి బ్రతుకది. గమ్యమే లేదా జీవితానికి. అంచేత దాని విలువ గుర్తించి దాన్ని అపురూపంగా వాడుకోగలగాలి మానవుడు. అలా వాడుకొంటే అది నీ మోక్షమార్గంలో నీకు ఎంతైనా సహాయపడుతుంది.
అది ఎలాగని అడుగుతావేమో. ఒక నదీ ప్రవాహాన్ని దాని ఇష్టానుసారంగా వదిలేస్తే పోయి సముద్రంలో కలుస్తుంది. నీకుపయోగ పడదు. దానికే పెద్ద ఆనకట్ట కట్టి పంటకాలువలు తీర్చి ప్రవహింపజేస్తే పొలం బాగా పండి ధాన్యం నీ చేతికి వస్తుందని ఇంతకుముందే పేర్కొన్నాము. అలాగే మనస్సును కూడా దాని పాటికి దాన్ని వదిలేస్తే ఎంత దూరమైనా వెళ్లిపోతుంది. ఎక్కడైనా పారేస్తుంది. మరి అది అదుపులోకి రావాలంటే దానికి ముందు చక్షురాది ఇంద్రియాల మీద నిగ్రహముండాలి. మనకు. ఇంద్రియాలదుపు తప్పితే అవే మనస్సును కూడా దారి తప్పిస్తాయి. గుమాస్తాలు అధికారిని తప్పు త్రోవ పట్టించినట్టు మనస్సునవి అపమార్గం పట్టిస్తాయి. ఈనాటి టెర్రరిస్టుల లాంటివవి. ఎంత ఆఫీసరునైనా కిడ్నాపు
Page 176