సాంఖ్య యోగము
భగవద్గీత
తాత్కలికంగా ఆపని చేసి కూచున్నా విషయ చాలప్యం పూర్తిగా తొలగిపోదు. కారణం వాడి కాత్మదర్శనం లేదు. ఆత్మ జ్ఞానం లేనంత వరకూ నీవెంత భీష్మించుకొని కూచున్నా వాసనారూపంగా విషయాభిలాష నిన్ను పురుగై తొలుస్తుంటుంది. కనుకనే రసవర్ణం అంటున్నాడు గీతాచార్యుడు. యోగికి రాగమింకా మిగిలి ఉంటుంది. ఇంద్రియాలు వాడి కధీనమైనా తద్విషయమైన చాపల్యం మీద వాడి కదుపు లేదు. అది లోపల మెదులుతున్నంత వరకూ పామున్న ఇంట్లో కాపురమున్నట్టే. అదుపు తప్పితే ఎప్పటికైనా పడగ విప్పి కాటు వేసే ప్రమాదముంది.
పోతే ఆత్మ జ్ఞాని అయిన వాడికలాటి ఉపద్రవం కూడా ఉండబోదు. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే- రసం లేదా రాగమనేది ఏ కొంచెం మిగిలినా పరం దృష్ట్యా - పరమాత్మ స్వరూప మెప్పుడూ అనుభవానికి వస్తుంటుంది కాబట్టి దాని బలంతో దీన్ని ఊచముట్టుగా త్రోసి పారేయగలడు. ఆత్మచైతన్య మనేది ఒక అఖండమైన ప్రకాశం. అది ఎప్పుడూ వాడి దృష్టిపధంలో ఉండగా వాసనలని చెప్పు - సంస్కారాలని చెప్పు - అవి ఎలా చోటుచేసుకోగలవు. చీకటి లాంటివివి వెలుగులోకి చీకటి ప్రవేశించగలదా. ప్రవేశిస్తే ఏమవుతుంది. వెలుగే అయిపోతుంది. ఇక చీకటి ఎక్కడిది.
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః || 60 ||
Page 174