సాంఖ్య యోగము
భగవద్గీత
వీతరాగ భయ క్రోధః రాగమూ భయమూ క్రోధమూ ఇలాటి ప్రతి లోమ భావాలన్నీ అప్రయత్నంగా సెలవు తీసుకొంటాయి వాడి విషయంలో ఇందులో రాగం క్రోధమనేవి అనుకూల ప్రతికూల భావాలు. సుఖం మీద రాగం - దుఃఖం మీద క్రోధం అంటే ద్వేషమనేది కలగటం సహజం మానవులకు. వాటిలో సుఖం లభించక పోయినా దుఃఖం ప్రాప్తించినా భయమనే మూడవది పొంచి ఉంటుంది పెద్దపులి లాగా మనమీద దూకటానికి. అంచేత మానవ మాత్రులు తప్పించుకోలేని ఈ మూడింటి గుప్పిటిలో నుంచి తప్పించుకో గలవాడే స్థిత ప్రజ్ఞుడు. మామూలు మానవు డాత్మ జ్ఞాన బలం లేనివాడు కాబట్టి వాటి వలలో పక్షిలాగా తగులుకొంటాడు. జ్ఞాన బలమున్న వాడు వాటి విషయంలో ఉపేక్ష వహించి తన మోక్ష మార్గాని కడ్డు తగలకుండా చూచుకోగలడు.
యః సర్వత్రానభిస్నేహస్తత్ తత్ ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 57 ||
అర్జునుడు వేసిన నాలుగు ప్రశ్నలలో మొదటి ప్రశ్నకిప్పుడు చెప్పుకొన్న రెండు శ్లోకాలలో సమాధానం వచ్చింది. స్థిత ప్రజ్ఞుణ్ణి ఏమని వర్ణిస్తారు లోకులని గదా ప్రశ్న. దానికిప్పుడిచ్చిన సమాధానమేమిటి. దేనిమీదా కోరిక పెట్టుకోక సుఖదుఃఖాది ద్వంద్వాలకు కూడా తట్టుకొని నిలబడ్డ వాడని సమాధానం. పోతే ప్రస్తుతం రెండవదానికి వస్తున్నది జవాబు. యః ఎవడైతే సర్వత్ర - అన్ని విషయాలలోనూ అనభి స్నేహః
Page 168