#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

మాత్రం భోజన భోజనాది చింత అసలే లేదా అని మరొక ప్రశ్న. వీటికి జవాబు చెప్పటం కష్టం. కష్టమనే శారీరం కేవలం కర్మ కుర్వన్ననే శ్లోకం దగ్గర ఆయనగారే అనుమతి ఇవ్వవలసి వచ్చింది. కామకర్మలకు. మరి ఎందుకలా వ్రాశారు గురువుగారు. చావుకు పెడితే లంకణాలకు దిగుతుందని సామెత. అంత కఠినంగా చెబితేగాని ప్రతి విషయంలో తల దూర్చే చాపల్యం మానుకోరీ మానవులని ఆయన మనసులో ఉన్నమాట.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే || 56 ||

  ఈ విధంగా ప్రాప్తమైన వాటితో తృప్తి పడుతూ అప్రాప్తమైన వాటి కోసం వెంపర్లాడకుండా ఎక్కడి కక్కడ అంతటా ఆత్మచైతన్య ప్రకాశమే సమానంగా వెలిగిపోతున్నట్టు స్వానుభవానికి తెచ్చుకొంటూ జీవయాత్ర సాగించగలిగితే - వాడు నిజంగా స్థితప్రజ్ఞుడే సందేహం లేదు. ఎందుకంటే కోరికలనూ కోరే పదార్ధాలనూ గాదు వాడు చూడడం. అవి ఏ వెలుగులో గోచరిస్తున్నాయో ఆ అధిష్ఠానమే అనుక్షణమూ దర్శిస్తుంటాడు. అలాంటి ఆత్మానుభవం గట్టిగా పట్టుకొన్నప్పుడాఖరు కెంత దుఃఖం ముంచుకు వచ్చినా కంగారు పడడు. దుఃఖే ష్వను ద్విగ్నమనాః

  ఆధ్యాత్మికాధి భౌతికాధి దైవికాలని దుఃఖం మూడు విధాలు. వీటికే తాపత్రయమని పేరు. అనుకోకుండా వచ్చి నెత్తిన పడుతుంటాయవి. అన్నీ

Page 166

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు