సాంఖ్య యోగము
భగవద్గీత
పైగా కోరినవన్నీ నెరవేరుతాయని చెప్పలేము. కోరనివి వచ్చి నెత్తిన పడవనీ చెప్పలేము. దానితో మనసు కారాటం ఆందోళన. మధన పడుతుంటుం దెప్పుడూ.
అలాంటప్పుడు మానవుడి ప్రజ్ఞ ఎలా స్థిరంగా నిలబడుతుందో చెప్పండి. పాదరసంలాగా అటూఇటూ పరుగెడుతూనే పోతుంది. కనుక ప్రజహాతి యదా ఈ కోరికలనే మానవుడు ఊచ ముట్టుగా త్రోచి వేయగలిగితే ధన్యుడు. అప్పుడు చెదరిపోయే ప్రశ్న లేదు కాబట్టి గత ప్రజ్ఞుడు కాక స్థిత ప్రజ్ఞుడని పించుకొంటాడు. అయితే కోరికలన్నీ వదిలేసి బ్రతకట మెలాగా అని ప్రశ్న వస్తుంది. ఏ కోరికా లేకపోతే ధనధాన్యాదులూ వస్తు వాహనాదులూ సంపాదించుకోలేము. తినలేము. ఉండలేము. బ్రతకలేము. శరీరం నిలబడాలంటే తినాలి. తాగాలి. అవి నడవాలంటే సంపాదించాలి. సంపాదించాలంటే సంపాదించాలనే సంకల్పముండాలి. ప్రయత్నముండాలి. కాబట్టి కామమనేది ఉండి తీరవలసిందే. కేవలం నిష్కామంగా బ్రతుకు సాగదని ప్రశ్న రావటం సహజమే.
దానికి జవాబిస్తున్నాడు గీతాచార్యుడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః అని సర్వాన్ కామాన్ అన్ని కోరికలూ లేకుండా పోయినా భయం లేదు. నీకు సంతృప్తి లేకుండా పోదు. కోరికలు తీరితేనే సంతృప్తి అనుకోకు. సంతృప్తి బాహ్యమైన పదార్ధాల వల్లనే అనుకొంటున్నావు. అది నీ భ్రాంతి. అయితే మరెలా కలుగుతుంది. ఆత్మన్యేవాత్మనా తుష్టః - ఆత్మవల్ల ఆత్మలోనే
Page 163