సాంఖ్య యోగము
భగవద్గీత
ఎన్నోరెట్లు ప్రశస్తమైనది. దీనివల్ల ఫలితమున్నది దానివల్ల లేదు. ఒకవేళ ఉన్నా అది పితృలోకం వరకేగాని ఆత్మజ్ఞానం కానేరదని ముందే పేర్కొన్నాము. అంతేగాక దానివల్ల లోకాంతరాలకు వెళ్లి ఎంత సుఖ మనుభవించినా మరలా వెనక్కు మరలవలసిందే. మరి కర్మయోగమైతే అలాటి పాటుపోట్లుండవు.
అది ఎలాగని ఆశ్చర్యపడ నక్కరలేదు. అది బుద్ధియోగం. యోగ విషయమైన బుద్ధి అయినా కావచ్చు. తత్పరిపాకం వల్ల కలిగే సాంఖ్యబుద్ధి అయినా కావచ్చు. రెండూ బుద్ధి యోగం క్రిందికే వస్తాయని వ్యాఖ్యానించారు భాష్యకారులు. యోగం సాంఖ్యాని కుపాయ Means మైతే సాంఖ్యం దాని కుపేయం End. రెండూ మోక్షమార్గంలో ఉన్నాయి కాబట్టి జన్మమరణాది చింత పెట్టుకోబని లేదు సాధకుడు.
అంచేత బుద్ధా శరణ మన్విచ్ఛ అని సలహా ఇస్తున్నాడు భగవానుడు. ఇలాటి బుద్ధియోగమే మనకు అభయాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి దానినే శరణు వేడటం మంచిది. పరమార్ధ జ్ఞానమే జీవిత పరమావధి అని దాన్ని అనుసరించి పోవటమే ఇక్కడ శరణాగతి. అలా కాక మొండిగా మానవుడు అనవసరమైన కర్మానుష్ఠానంతోనే యావజ్జీవమూ కాలం గడుపుతూ పోయాడో ఎంతో విలువైన కాలం వృధా చేస్తున్నాడు. కృపణాః ఫలహేతవః - అలాటి వాళ్లందరూ కృపణులంటున్నది గీత. కృపణు లంటే శోచనీయులు. Pitiable అని అర్ధం. ఎంచేత శోచనీయులు. ఫలహేతవః – ఫలం మీదనే కోరిక పెంచుకొని భోక్తృత్వ బుద్ధి వదలకుండా
Page 152