సాంఖ్య యోగము
భగవద్గీత
నిర్ణయించా లతడే కోవవాడో. పరీక్షాధికారి ఆయన గదా. ఆయన చెబితే దానికి తిరుగులేదు.
మరి ఆ గురువు శిష్యుణ్ణి గూర్చి ఏమని సెలవిచ్చాడు. కర్మణ్యేవాధికారస్తే అర్జునా నీకు కర్మలోనే అధికారం Admission జ్ఞానంలో కాదు. అంటే అర్జునుడు మందాధికారి అని వేరే చెప్పనక్కరలేదు. ఇంత దూరమదీ ఇదీ బోధ చేస్తూ వచ్చి తీరా ఇప్పుడు వాణ్ణి పట్టుకొని పరమాత్మ మందాధికారివి పొమ్మంటే ఏమి న్యాయమని నీకూ నాకూ అనిపించవచ్చు. ఇక్కడ రెండు మర్మాలున్నాయి ఆయన మాటల్లో మనం గ్రహించవలసినవి. ఒకటి గీతోపదేశం ఒక అర్జునుడికే గాదు సర్వులకూ. అర్జునుడు ఒక నిమిత్తమేనని మొదటినుంచీ చెబుతూనే వచ్చాము. అంచేత శాస్త్రమిప్పుడు జ్ఞానం కర్మ రెండూ చెబుతున్నదంటే రెండూ అర్జునుడికే ఉద్దేశించి చెప్పిందని పొరబాటు పడగూడదు. అర్జునుడి లాంటి వారికి కర్మ అయితే ఏ ఉద్దవుడిలాంటి ఉత్తమాధికారికో జ్ఞానం బోధించి ఉండవచ్చు. గీతలో ఉద్దవుడి పేరు లేదే అంటే ఉద్దవుడి లాంటి వాడంటున్నాము గుర్తించండి. మనుష్యాణాం సహస్రేషు అన్నట్టు కొద్దిమంది ఉత్తమాధికారు లుండవచ్చు మానవులలోనే. వారు ద్వాపరంలోనే కాదు. ఈ కలియుగంలో ఇప్పుడు కూడా ఉంటారు. అలాంటి వారికి గీత జ్ఞానమే బోధిస్తుంది కర్మ గాదు. అందుకే జ్ఞానయోగేన సాంఖ్యానామని తరువాత రెండూ విభక్తం చేసి చెప్పబోతాడు కృష్ణభగవానుడు.
Page 146