సాంఖ్య యోగము
భగవద్గీత
తప్పలేదన్నట్టు యజ్ఞయాగాదులు చేసి స్వర్గాన్ని కొట్టేశానని నీవు సంతోషించినా అదీ తాత్కాలికమే.
కనుకనే ఈశావాస్యంలో అంధేన తమ సావృతా అనే చోట అర్ధం వ్రాస్తూ స్వర్గం కూడా నరకంలాగా అంధకార బంధురమే. అదీ వాస్తవంలో నరకమే. కారణమేమంటే ఆత్మచైతన్య ప్రకాశమనేది ఇక్కడా లేదక్కడా లేదు నరకం గాక స్వర్గమెలా అయిందని ప్రశ్నించారు భగవత్పాదులు. అంచేత ఒక సంతర్పణలో అంతా మనకోసమే వడ్డించారని అన్ని విస్తళ్లముందూ మనమే ఎలా కూచోమో - అలాగే వేదవాఙ్మయంలో ప్రతిమాటా మనకోసమే మనమే దాన్ని అమలుపరచాలని భావించటం కూడా పెద్ద పొరబాటు. మందాధికారుల కోసం కర్మ చెప్పింది వేదం. మధ్యముల కోసం ఆయా ఉపాసనలు బోధించింది. చివరకు వేదాంతంలో ఉత్తమాధికారులైన వారికే ఆత్మజ్ఞాన ముపదేశించింది. అధికార భేదాన్ని బట్టి దాని బోధ - పిడుగుకూ బియ్యానికీ ఒకే మంత్రమన్నట్టు కాదు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోఽస్త్వకర్మణి || 47 ||
అయితే ఇప్పుడీ గీతా శ్రోత అర్జునుడే కోవకు చెందినవాడా అని ప్రశ్న వచ్చింది. వీడుత్తముడా - మధ్యముడా - మందుడా. ఎవరు చెప్పాలీ మాట. అర్జునుడా. అర్జునుడు తనకు తాను సర్టిఫికే టిచ్చుకోటం బాగుండదు. పోతే అతనికి బోధ చేస్తున్న గురువుగారు కృష్ణ పరమాత్మే
Page 145