సాంఖ్య యోగము
భగవద్గీత
వాటి మీద దృష్టి ఉన్నంత వరకూ శ్రేయోమార్గంలో ప్రయాణం చేయలేడు సాధకుడు. కనుక వాటి మీద చూపుపెట్టరాదు. వాటి పాటికవి జరుగుతూ పోతే సాక్షిగా చూస్తుండాలని భావం. అలా చూస్తూ కూచోవాలంటే మాటలు గాదు. ఆత్మవాన్ అన్నారు. ఆత్మవంతుడ వయి ఉండాలి. అంటే అప్రమత్తుడవయి Total attention ఉండాలని అర్ధం వ్రాశారు స్వామివారు. ఏమాత్రమూ పరాకు లేకుండా తానుగా దేనికీ ప్రాకులాడకుండా జరిగే ప్రతి పనీ జ్ఞానదృష్టితో గమనిస్తూ ఉండాలని సాధకుడికిచ్చే సలహా. అది పాటిస్తే కలిగే ఫలమూ అదే.
యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః || 46 ||
కాకపోయినా వేదం చెప్పింది - మేము చేస్తున్నామని తమ అపరాధం నిష్కారణంగా వేద వాఙ్మయం మీద తోస్తున్నారే కర్మిష్ఠులు. వేదమేమని చెప్పింది. నీవెప్పుడూ కర్మలే చేస్తూ కూచోమని చెప్పిందా. ఆ మాటకు వస్తే అది కర్మలూ చెప్పింది. జ్ఞానమూ చెప్పింది. ఉదపానే సర్వతః సంప్లుతోదకే అది ఒక కూపమూ తటాకం లాంటిది. తటాకంలో ఎంతైనా ఉంటుంది జలం. ఒడ్లు రెండూ ఒరుసుకొని పారుతుంటుంది. అందులో దిగి ఒక మానవుడు దాహం తీర్చుకోవా లనుకోండి. ఎక్కడ దిగాలి ఎంత నీరు త్రాగాలని అడిగితే ఏమని చెబుతావు. ఎక్కడ దిగినా నీకెంత నీరు త్రాగాలనిపిస్తే అంతే త్రాగి పొమ్మని సలహా ఇస్తావా లేదా. అందులో
Page 143