సాంఖ్య యోగము
భగవద్గీత
లేదు శోకం లేదు. ఎవరిని గూర్చీ నీవు శోకించ నక్కరలేదని అభయమిచ్చాడు. పోతే అలాటి దృష్టి అలవడ లేదనుకోండి. అలవడక లౌకికమైన దృష్టి పెట్టుకొని చూచినా పరవాలేదు. అప్పుడు కూడా నీవు శోకించ నక్కరలేదు. ఎందుకంటే జాతస్యహి ధ్రువో మృత్యుః – పుట్టినవాడు పోక తప్పదు. అంతేగాక ఎవడి ధర్మం వాడు పాటిస్తూ జీవించినప్పుడా ధర్మమే వాణ్ణి కాపాడుతుంది. దానివల్ల మోక్షమనే మహాఫలం కాకున్నా అభ్యుదయమనే ఫలమైనా సిద్ధిస్తుంది.
ఇదీ ఇంతవరకూ జరిగిన విషయం. ఇందులో ప్రధానంగా నడచింది పారమార్ధికమైన బోధే. అధచైనం నిత్యజాతం స్వధర్మ మపి చావేక్ష్య మొదలుకొని ఇంతవరకూ సాగిన బోధ పారమార్ధికం కాదు. వ్యావహారికం. లోకవ్యవహారాన్ని బట్టి చూచినా శోకమోహా లక్కర లేదని ధైర్యం చెప్పటానికే ఈ ఉపన్యాసం. ఇది ఉపదేశం కాదు. ఉపన్యాసం. ఇదంతా మనసులో ఉంచుకొనే వ్రాస్తున్నారు భగవత్పాదులు.
శోకమోహాపనయ నాయ లౌకికో న్యాయః స్వధర్మమపి చావేక్ష్య ఇత్యాద్యైః శ్లోకైరుక్తః - నతుతాత్పర్యేణ - పరమార్ధ దర్శన మిహ ప్రకృతం-తచ్చోక్త ముపసంహ్రియతే ఏషాతే భిహితా ఇతి - శాస్త్ర విషయ విభాగ ప్రదర్శనాయ - అని. శాస్త్రానికి విషయ విభాగమెప్పుడూ ముఖ్యం. అంతా కలగాపులగం చేసి చెప్పగూడదు. వినేవాళ్ళ మనసు కూడా కలగాపులగ మయిపోతుంది. కనుకనే గీతాశాస్త్ర మిప్పుడీ శ్లోకంలో ముందుగా మనకు
Page 128