#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

అర్జునుడిలాగా ముక్కుకు సూటిగా ముందుకే దూసుకుపోవాలి మనమంతా. నైవం పాప మవాప్స్యసి. అలా దృఢ సంకల్పంతో సాగిపోతే మనకు కష్టనష్టా లెప్పటికీ కలగవు. పాపం పాతక మంటే పడగొట్టేదని అసలైన అర్ధం. పైకి రాకుండా పడిపోతామనే భయం లేదు. తాత్కాలికంగా పడ్డట్టు కనిపించినా కందుకమువోలె సుజనుడు క్రిందంబడి మగుడ మీదికి న్నెగయు జుమీ అని భర్తృహరి చెప్పినట్టు మళ్లీ జీవితంలో అభ్యుదయం కలిగి తీరుతుంది. ఒకవేళ కలగక పోయినా అధర్మం చేయలేదు ధర్మ మార్గంలోనే జీవించాము గదా అనే సంతృప్తి అయినా ఏర్పడుతుంది. ఇక నష్టమేముంది మానవుడికి. నష్టమే మంచి పనీ చేయలేక ఏడుస్తూ కూచున్నప్పుడే. అలాకాక మన ధర్మం మనం పాటించినప్పుడు సుఖదుః ఖాలు రెండూ మనకు సమానమే. కనుక అందులో ఏది జరిగినా అది లాభమే మనకు. ఇలాటి దృష్టి ఉన్నప్పుడిక ఏ భయమూ లేదు మానవుడికి. ఇదీ దీనిలో మనం గ్రహించవలసిన భావం.

ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి || 39 ||

  ఇంతవరకూ గీత మనకు బోధించిన విషయమేమిటి మనం గ్రహించినదేమిటి - అని ఒక్కసారి పునశ్చరణ చేసుకోవలసి ఉంది. ఆత్మానాత్మ వివేచన చేసి ఆత్మస్వరూప మేదో అందించాడు మొదట పరమాత్మ. అది పారమార్థిక దృష్టి, ఆ దృష్టి పెట్టుకొని చూస్తే నీకు మోహం

Page 127

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు