ఉపోద్ఘాతము (ప్రధమ)
భగవద్గీత
సాగితే విజయవాడలో 96 రోజులు గడిచింది. అది కాసెట్లలో రికార్డు చేశారు మనవాళ్లు.
అంతటితో ఆగకుండా స్వదేశంలోనూ విదేశాలలోనూ ఉన్న మా శిష్యులే కొందరు వాటిని గ్రంధస్థం చేసి ప్రచురించమని హార్దికంగా ఆర్ధికంగా కూడా నన్ను ప్రోత్సహించారు. గ్రంధస్థం చేసే ఓపిక నాకీ వయసులో లేదని చెబితే - పోనీలెండి మేమే చేసి మీకిస్తామని చెప్పి కొందరు శిష్యురాండ్రు ఇటు విజయవాడలో అటు హైదరాబాదులో అదే పనిగా కూచుని పాపం పది పదిహేనధ్యాయాల వరకూ కాసెట్లు వింటూ వాటిని చక్కగా కాగితాల మీద వ్రాసి చేతికిచ్చారు. ఆర్థికంగానూ యధాశక్తిగా తోడుపడ్డారు. విదేశవాసులైన శిష్యులు సమక్షంలో లేకున్నా ఆర్థికంగా బాగా ఆదుకొన్నారు నన్ను. ఇంతగా ఇంతమంది పట్టుపడితే ఇక నేను బద్ధకించి ప్రయోజనం లేదని రంగంలో దిగవలసి వచ్చింది.
కాని తీరా దిగన తరువాత రెండు ఇబ్బందు లెదురయ్యాయి. నేను భగవద్గీత ప్రచవనం చేసినప్పుడేవేవో చెప్పాను. ఎన్నెన్నో చెప్పాను విషయాలు. శంకర భాష్యమూ చెప్పాను. దానిమీద ఎంతో భావన చేసీ చెప్పాను. అక్కడి నుంచీ ఇక్కడి నుంచీ పట్టుకు వచ్చి ఎన్నో ప్రసంగాలు చేశాను. అందులో చాలా పునరుక్తులూ ఉన్నాయి. అప్రస్తుత ప్రసంగాలూ ఉన్నాయి. అవన్నీ అలాగే ఉంచి ప్రచురిస్తే బాగుండదు. గందరగోళంగా ఉంటుంది పాఠకులకు. కనుక ప్రచురణ కనుగుణంగా ఎంతో సవరించి ఒక పద్ధతిలో పెట్టవలసి వచ్చింది. ఇది ఒకటి.
Page 12