సాంఖ్య యోగము
భగవద్గీత
పోలేదు కూడా. ఎందుకంటే ఆత్మ అనేది శుద్ధచైతన్యం తప్ప మరేదీ కాదు. చైతన్యానికొక ఆకారమంటూ ఉండబోదు. అది నిరాకారం. నిరాకారమైతే వ్యాపక మవుతుంది. సర్వవ్యాపకం గనుక అది జంగమాలలో ఎలా ఉంటుందో స్థావరాలలో కూడా అలాగే ఉండగలదు. సర్వస్య అనటంలో స్థావర జంగమాలు రెండూ కలిసి వస్తాయంటారు భాష్యకారులు. స్థావర జంగమాలు రెండూ దానికి శరీరాలు. అది నిరాకారమైతే ఇవి సాకారం. అది నిరవయవమైతే ఇవి సావయవం. సాకారం సావయవం గనుకనే ఇవి ఎప్పటికప్పుడు వస్తాయి పోతాయి. జనన మరణాలు వీటికే. దానికి గాదు. అది నిరాకారం నిరవయవం కాబట్టి రాకపోకలు లేవు దానికి. కనుక నిత్య వమధ్యోయం - నిత్య సిద్ధమది అని వ్యాఖ్యానిస్తారు గురువుగారు.
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే || 31 ||
ఇక్కడికి ఆత్మజ్ఞాన ప్రకరణం సమాప్తమయింది. ఆత్మ దృష్టితో చూస్తే నేను చంపుతున్నానే - ఇంతమంది నా మూలంగా చస్తున్నారే అని బెంగ పెట్టుకో నక్కరలేదు. ఏ కర్మ జరిగినా ఆ కర్మకు నేను కర్తను కాను కేవలం ద్రష్టనే అనే బరవసా ఉంటుంది జ్ఞానికి. ఇది పారమార్ధికమైన దృష్టి. పోతే అలాకాక లౌకికమైన దృష్టితో చూచినా శోకించ నక్కరలేదని చాటుతున్నా డిప్పుడు భగవానుడు.
Page 114