సాంఖ్య యోగము
భగవద్గీత
అంచేతనే మనకు జన్మాంతర జ్ఞానం లేదు. అందుకే మనం జీవులమే గాని ఈశ్వరులం కాకుండా పోయాము. వృత్తి సంస్కార చక్రంగా సాగే ఈ జ్ఞానానికి స్వస్తి చెప్పి ఎప్పటికైనా ఆ సాక్షిజ్ఞానమే నేనని మనలను మన మర్ధం చేసుకోగలిగితే అప్పుడు మనం జీవులమే గాదు. కర్తృత్వ భోక్తృత్వా లుండవు మనకు. ఉండకపోతే మనమిక ఈశ్వర స్వరూపులమే. అంటే జనన మరణ రూపమైన ఈ విషవలయంలో నుంచి బయటపడగలం. అంతవరకూ అవిద్యావశ వర్తులమే కాబట్టి ఏ జీవికీ తన మరణం గుర్తు లేదు. మరణానంతరం జననమూ గుర్తు లేదు. ఇదీ మనకు శాస్త్రమిచ్చే సమాధానం.
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || 28 ||
అయితే జీవుడు కూడా ఈశ్వరుడేనని గదా అద్వైత సిద్ధాంతం. అలాంటప్పు డీశ్వరుడి కన్నీ గుర్తుండట మేమిటి. జీవుడికి లేకపోవట మేమిటి. అవిద్యావశాత్తంటారా. ఈ అవిద్య ఎక్కడిది. ఇది జీవుణ్ణి మాత్రమే బంధించట మేమిటి. అనే ప్రశ్నకిప్పుడు జవాబిస్తున్నదీ శ్లోకం. అవిద్యాత్మికాహి బీజ శక్తి రవ్యక్త శబ్ద నిర్దేశ్యా పరమేశ్వరా శ్రయా మాయా మయీ మహాసుప్తిః అని సూత్రభాష్యంలో స్వామి వారీ విషయాన్ని ఎంతో దూరం వివరించారు. అవిద్య అంటే అవ్యక్తమైన మాయా శక్తి. అవిద్య అవ్యక్తం మాయా సుప్తి అనే శబ్దాల కన్నిటికీ ఒకటే అర్ధం. వ్యక్తం కానిదేదో
Page 109