#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

ఉన్నప్పుడీ యాత్ర. - నత్వం శోచితు మర్హసి. ఇక నీవు పోయారే అని ఎవరిని గూర్చీ దిగులు చెందట మనవసర మంటాడు భగవానుడు. నిజమే - కాని ఒక్క విషయం. పుట్టినవాడు పోయి ఆ పోయినవాడే మళ్లీ వచ్చాడని తెలిస్తే మీరు చెప్పినట్టు మాకు దిగులూ విచారమూ లేదు కాని పుట్టినవాడు పోవటమే చూస్తున్నాము గాని పోయినవాడు మరలా రావట మెక్కడా చూడటం లేదు మనం. శాస్త్రం చెప్పటమే అది. మన అనుభవంలో లేదు. ఒకవేళ వస్తాడని శాస్త్రం హామీ ఇచ్చినా ఆ చచ్చినవాడే ఈ పుట్టినవాడనే ప్రజ్ఞ ఆ చచ్చిన వాడికీ లేదు. ఈ పుట్టినవాడికీ లేదు. వాడే వీడనే జ్ఞానం బంధు మిత్రాదులకూ లేదు. నిజంగా వాడే వీడుగా జన్మించి ఉంటే వీడికా పూర్వజన్మ స్మృతి లేకుండా పోవటమేమిటి. రాత్రి పడుకొని నిద్రపోయాము. పోతున్న వరకూ నీకూ ముందురోజు జరిగిన వృత్తాంతం గుర్తు లేకపోయినా తెల్లవారి మెలకువ రాగానే గుర్తు వస్తున్నదా లేదా. ఇంకా ప్రాణమనేది ఉంది కాబట్టి దాన్ని భరిస్తున్న ఈ స్థూల దేహమింకా ఉంది కాబట్టి ఉంటున్నదా స్మృతి Conscience మనకు. కాని ఈ దేహమూ ప్రాణమూ రెండూ బూదిపాలయి పోయాయి మరణంతో. అలాంటప్పు డెవడు వచ్చాడో ఎవడు రాలేదో ఎలా చెప్పగలం.

  సరిగా ఇదే ప్రశ్న వేశాడు ఛాందోగ్యంలో తన తండ్రి ఉద్దాలకుణ్ణి శ్వేతకేతువు. నాన్నా ప్రతివాడూ చివరకు కన్ను మూస్తున్నాడు గదా. జీవన్ముక్తుడికైనా మరణం తప్పదని చెప్పారు గదా మీరు. మరి ఒక తరంగం

Page 106

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు