హాసాలలో స్వర్గ నరకాది లోకాలను - వాటిని చేరే అర్చిరాది మార్గాలను ఆయాలోకాలలో కలిగే అనుభవాలను - తదనంతరం మరలా ఈ కర్మ భూమిలో ఏ ఏ జన్మలెత్తాలో అవి వన్నె చిన్నెలు పెట్టి వర్ణించారంటే అదంతా ఈ భేద దృష్టిని బట్టి చేసిన వర్ణనే. పరిష్కారమే. ఇదే యథార్థమని భావించామో మనకర్మ కాండ అంతా మన కనివార్యమే అవుతుంది. జాతాశౌచం దగ్గరి నుంచి మృతాశౌచం వరకు అంతా పాటించ వలసిందే. శరీరమే పోతుంది గాని జీవుడు పోడు. వాడీ దేహాన్ని వదిలేసి తన కర్మ కనుగుణమైన లోకాలకు ప్రయాణం కడతాడని మరలా ఒక దేహం ధరించే లోపు అతనికి మనం చేయవలసిన క్రతువులన్నీ ఇహంలో చేసితీరాలని - చేస్తే వాటి ఫలితమా జీవికి చెందుతుందని అనుష్ఠాన మంతా పాటించక తప్పదు. ఇలాటి
పోతే భేద దృష్టితో కాక రెండవదైన అభేద దృష్టితోనే చూడగలిగితే ఈ చెప్పుకున్నదంతా ఏదీలేదు. అంతా వట్టి అబద్దమని తేలిపోతుంది. కారణమేమంటే ఈ అభేద దృష్టికి అంతా ఆత్మ స్వరూపమే. అనాత్మ ప్రపంచమంటూ దానికి వేరుగా మరొకటి ఏదీ లేదు. అంతా నేనని భావిస్తే ఇహ పరాలు లేవు. తోటి జీవులు లేరు. వీటికి నియామకుడని భావించే ఈశ్వరుడు లేడు. ఆత్మ చైతన్యంలోనే అన్నీ సమసి పోతాయి. అలాంటప్పుడిక జననమేమిటి, మరణమేమిటి. ఎక్కడ ఉన్నాయవి. అవీ నా స్వరూపమే. ఒక వేళ నాకు చెందిన వనుకున్నా పరవాలేదు. అవి దశలే అవుతాయి. గాని నేను గాను. దశలు మారినా దశానాథుడు మారడు. ఇంతెందుకు. ఒక చెరువులో నీరు కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అందులో ఒక రాయి వేశావంటే కదలిక ఏర్పడుతుంది.
Page 92