#


Index

  స్వరూపమని గుర్తు చేసుకోవటమే పరిష్కారం. ఇదే సముద్రమథన వృత్తాంతంలోని సంకేతం. శివుడు హాలాహలాన్ని భక్షించి మృత్యుంజయు డయ్యాడంటే ఏమిటీ భావం ? అందరూ అన్నీ విలువైన వస్తువులు పోగు చేసుకొంటే ఆయన భయానకమైన విషాన్నే భక్షించాడు. నీవీ ప్రాపంచికమైన వస్తు వాహనాలెంత నీ కనుకూలమని దగ్గర ఉంచుకున్నా సుఖంలేదు. మృత్యువును జయించే రహస్యం నీకు బోధపడితేనే జీవితానికి విజయమని చాటటమే కదా దాని తాత్పర్యం.

  నిజమైన విజయం నశ్వరమైన సంసార సుఖాలు పోగుచేసుకొని అనుభవించటంలో లేదు. అవి ఎలానశ్వరమో వాటి అనుభవమూ నశ్వరమే. కనుక భోగం కాదు కోరవలసింది మానవుడు త్యాగం. తేనత్యక్తేన భుంజీథాః అని చాటుతున్న దుపనిషత్తు. త్యజిస్తూ భుజించాలట మనం. త్యజించ వలసిం దేమిటి ? భుజించే దేమిటి క్షణ భంగురమైన ప్రావంచిక విషయాలను త్యజించాలి. శాశ్వతమైన పారమార్ధిక సుఖాన్ని భుజించాలి. ఇక్కడ త్యాగబుద్ధి ఉంటే కాని అక్కడ భోగానుభవం ప్రాప్తించదు, అందుకే విష్ణువు భోగానికైతే శివుడు త్యాగానికి ప్రాతినిధ్యం వహించాడు. భోగత్యాగాలు రెండూ వేరుకావు. పైకి వేరుగా కనిపిస్తాయి కాని ఆంతర్యంలో రెండూ ఒకటే. నీకు భిన్నమనే భావాన్ని త్యజిస్తే ప్రతి ఒక్కటి నీస్వరూప విభూతేనని అనుభవానికి వస్తుంది. అప్పుడీ త్యాగమే భోగ మనిపించు కుంటుంది, శివ కేశవుల కప్పుడు భేదమే లేదు. పరమాత్మ ప్రపంచంగా కనపడటమే స్థితిరూపమైన విష్ణుతత్త్వం. అది తన కభిన్నంగా భావించి అందులో లయం చేసుకోటమే శివతత్వం. ఈ భేదాభేదరూపమైన దొకే ఒక పరమాత్మ చైతన్యం.

Page 88