బాహ్యమైన విశ్వ శరీరమే కావచ్చు. అన్నీ నశ్వరమే. అవి నశ్వరమని భావిస్తూ మీ జ్ఞానంలో లయం చేసుకొని మీ శక్తిని మీరు మరలా వశం చేసుకొని ఎదిగి నన్ను చూడగలిగితే మీరు కోలుపోయిన సచ్చి ద్రూపాన్ని మరలా మీరు పరిపూర్ణంగా పొందగలరు. దానితో పాటు పరిపూర్ణమైన ఆనందాన్ని కూడా బడయగలరని ఆయన ఆనందతాండవం మనకు నిశ్శబ్దంగా బోధిస్తున్నది. ఆయన అట్టహాసం మనకు సశబ్దంగా చాటి చెపుతున్నది.
ఇది చెవిన పడనంతవరకూ గజాసురులమే మనం. గజ మహంకారానికి సూచకం. అహంకారమే జీవ లక్షణం. ఇది శవలక్షణమే కాని శివలక్షణం కాదు. దీన్ని తొలగించు కొనే సాధన చేయాలి మానవుడు. అది వీడికి సాధ్యం కాక పోతే కరుణాళుడైన ఆయనే తొలగిస్తాడు. అప్పుడ సురసంపద నశించి దైవ సంపదతో ఆ శివ తత్త్వం దర్శన మిస్తుంది. ఇదే గజాసుర సంహారం. మనలో ఉన్న గజాసురుడు పోతే మనకున్నది ఇక నందికేశ్వరుడే. నంది అంటే వృషభం ద్వారపాలకుడది. మోక్ష ద్వారాన్ని కాస్తున్నది. వృషభం ధర్మానికి సంకేతం. అర్థ కామాల లాగానే ధర్మం కూడా లయ స్వరూపమైన మోక్షానికి ప్రతి బంధకం. మోక్ష ద్వారాని కడ్డు తగులుతున్నదది. దానికి కాలం తోడ్పడుతున్నది. సమస్తాన్ని హింసించేది కనుక అది సింహం. రెండూ కలిసి నివసిస్తున్నాయి కైలాసంలో. అంటే సహస్రార రూపమైన మన బుద్ధిలో. వాటి అడ్డు తొలగించుకొని ముందుకు సాగిపోవాలి మానవుడి బుద్ధి. దానికి గొప్ప ధైర్య సాహసాలు కావాలి. అలాంటి జీవుడెవడో వాడు మార్కండేయుడు. "మనుష్యాణాం సహస్రేషు” అన్నట్టు కోటికొక డుంటాడు అలాంటి పట్టుదలగల సాధకుడు. పట్టుదల మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు. పట్టుకోటానికొక ఆలంబన ముండాలి.
Page 86